అందుకే జగన్ దిల్లీ పర్యటన: యనమల
సంజాయిషీలు చెప్పడానికే సీఎం జగన్ దిల్లీ పర్యటనలు తప్ప.. రాష్ట్రానికి రావాల్సినవి సాధించడానికి కాదని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల
అమరావతి: సంజాయిషీలు చెప్పడానికే సీఎం జగన్ దిల్లీ పర్యటనలు తప్ప.. రాష్ట్రానికి రావాల్సినవి సాధించడానికి కాదని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అరాచకాలు, అవినీతి చేయడం దిల్లీ వెళ్లి చీవాట్లు తినడమే జగన్ పని అని విమర్శించారు. తన కేసుల భవిష్యత్తే తప్ప రాష్ట్ర భవిష్యత్తు జగన్కు పట్టదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా పేరెత్తడం జగన్ మరచిపోయి 16 నెలలైందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన వైకాపా నోరు ఇప్పుడెందుకు మూతపడిందని నిలదీశారు.
కోర్టులో ఉన్న అమరావతి అంశంపై పదే పదే కేంద్రాన్ని ఒత్తిడి చేయడం గర్హనీయమని విమర్శించారు. ఇప్పటి వరకు జగన్ ఎన్నిసార్లు దిల్లీ వెళ్లారు? 16 నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం సాధించారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందని డిమాండ్ చేశారు. 16 నెలల్లో రూ.1.28లక్షల కోట్లు అప్పులు తేవడమే జగన్ మోహన్రెడ్డి రికార్డని ఎద్దేవా చేశారు. 31వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులతో చంద్రబాబు గిన్నిస్ రికార్డు సాధిస్తే... నెలకు రూ.8వేల కోట్ల అప్పులు తేవడంలో జగన్ ప్రపంచ రికార్డు నెలకొల్పారని దుయ్యబట్టారు. దేశంలోనే టాప్ 3 లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఇప్పుడు 21వ స్థానానికి పతనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులు కొల్లగొట్టడంపై తప్ప సమాజంలో ఆస్తులు కల్పనపై వైకాపాకు దృష్టిలేదని విమర్శించారు. ఈ అరాచకాలకు వైకాపా తగిన మూల్యం చెల్లిస్తుందన్న యనమల... సరైన సమయంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు