Andhra News: చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపిన వైకాపా నేత

పశ్చిమగోదావరిలోని నరసాపురం జిల్లా కేంద్రం సాధనలో వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజు విఫలమయ్యారని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

Published : 03 Mar 2022 01:41 IST

నరసాపురం: పశ్చిమగోదావరిలోని నరసాపురం జిల్లా కేంద్రం సాధనలో వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజు విఫలమయ్యారని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ముఖ్యభూమిక పోషించి ఇప్పుడు బాధపడుతున్నానంటూ తనను తాను చెప్పుతో కొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. నరసాపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం నరసాపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

 ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ... జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు మోసం చేశారని మండిపడ్డారు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేయకుండా ప్రసాదరాజు ప్రజలను మోసం చేశారన్నారు. బ్రిటీష్‌ కాలం నుంచి గొప్ప చరిత్ర ఉన్న నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఎన్నికల్లో జగన్‌ని దృష్టిలో పెట్టుకొని పని చేశామని.. అప్పుడే తెలిసి ఉంటే ప్రసాదరాజు లాంటి వ్యక్తికి ఎన్నికల్లో సీటు ఇవ్వొద్దని ప్రజలు కోరుకునే వారని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, తెదేపా ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, జనసేన ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని