Andhra News: చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపిన వైకాపా నేత
పశ్చిమగోదావరిలోని నరసాపురం జిల్లా కేంద్రం సాధనలో వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజు విఫలమయ్యారని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు
నరసాపురం: పశ్చిమగోదావరిలోని నరసాపురం జిల్లా కేంద్రం సాధనలో వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజు విఫలమయ్యారని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ముఖ్యభూమిక పోషించి ఇప్పుడు బాధపడుతున్నానంటూ తనను తాను చెప్పుతో కొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. నరసాపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం నరసాపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ... జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు మోసం చేశారని మండిపడ్డారు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేయకుండా ప్రసాదరాజు ప్రజలను మోసం చేశారన్నారు. బ్రిటీష్ కాలం నుంచి గొప్ప చరిత్ర ఉన్న నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఎన్నికల్లో జగన్ని దృష్టిలో పెట్టుకొని పని చేశామని.. అప్పుడే తెలిసి ఉంటే ప్రసాదరాజు లాంటి వ్యక్తికి ఎన్నికల్లో సీటు ఇవ్వొద్దని ప్రజలు కోరుకునే వారని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, తెదేపా ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, జనసేన ఇన్ఛార్జి బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM