క్రికెట్ అభిమానులకు భారీ షాక్!
క్రికెట్ అభిమానులకు భారీ షాక్! యూఏఈ వేదికగా జరుగుతున్న లీగ్ నుంచి భారత సీనియర్ క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా గాయాలతో దూరం కానున్నారని సమాచారం. చెన్నైతో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ తుంటికి గాయమైన సంగతి తెలిసిందే. 19వ ఓవర్లో బౌలింగ్ చేస్తూ
లీగ్ నుంచి ఇద్దరు భారత సీనియర్ క్రికెటర్లు దూరం
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్ అభిమానులకు భారీ షాక్! యూఏఈ వేదికగా జరుగుతున్న లీగ్ నుంచి భారత సీనియర్ క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా గాయాలతో దూరం కానున్నారు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ తుంటికి గాయమైన సంగతి తెలిసిందే. 19వ ఓవర్లో బౌలింగ్ చేస్తూ అతడు గాయపడ్డాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం ముంబయితో జరిగిన మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. అయితే అతడి గాయం తీవ్రత అధికంగా ఉందని సీజన్ నుంచి దూరం కానున్నాడని జట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బౌలింగ్కు నాయకత్వం వహించే భువీ జట్టులో లేకపోవడం తమకి తీవ్ర ప్రతికూలాంశమని పేర్కొన్నాయి.
మరోవైపు దిల్లీ జట్టు సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వేలి గాయంతో టోర్నీ నుంచి నుంచి దూరం కానున్నాడని దిల్లీ జట్టు ఉన్నతాధికారి ఒకరు జాతీయ మీడియాతో తెలిపారు. శనివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో మిశ్రా వేలికి గాయమైన సంగతి తెలిసిందే. అతడు వేసిన తొలి ఓవర్లో నితీశ్ రాణా ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను అందుకోవడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. దీంతో గాయం కారణంగా తన స్పెల్ను పూర్తిచేయకుండానే ఆ మ్యాచ్ను ముగించాడు. అయితే అతడి స్కానింగ్ ఫలితాలు సానుకూలంగా లేవని, గాయం తీవ్రత అధికంగా ఉందని దిల్లీ జట్టు ఉన్నతాధికారి వెల్లడించారు. అంతేకాకుండా, అధికారిక ట్విటర్ వేదికగా కూడా స్పష్టం చేశారు.
‘‘రిపోర్ట్స్ వచ్చాయి. ఇది చెడ్డ వార్త. మిశ్రా ఈ సీజన్లోని మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండడు. అతడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తాం. అయితే మంచి లయలో ఉన్న అతడు టోర్నీ నుంచి దూరం కావడం దురదృష్టకరం. అతడి అనుభవం మిడిల్ ఓవర్లలో జట్టుకే కాకుండా యువ స్పిన్నర్లకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అని దిల్లీ జట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. షార్జా వేదికగా శనివారం జరిగిన కోల్కతా×దిల్లీ మ్యాచ్లో 438 పరుగులు నమోదయ్యాయి. చిన్న మైదానంలో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కానీ రెండు ఓవర్లు వేసిన అమిత్ మిశ్రా 14 పరుగులే ఇచ్చాడు. తాను వేసిన తొలి ఓవర్లో గాయపడినా ఫిజియో చికిత్స అనంతరం మరో ఓవర్ బౌలింగ్ చేశాడు. ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ను పెవిలియన్కు పంపించి కోల్కతాను దెబ్బతీశాడు. అయితే తర్వాత నొప్పి అధికం కావడంతో డగౌట్కు చేరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!