చెన్నై ఓటములకు కారణాలివే..!
‘‘అరెరే.. మన చెన్నై జట్టుకు ఏమైంది..? ఎందుకిలా ఢీలా పడిపోయింది. ఇప్పుడున్న ధోనీసేన.. గతంలోని మన ఛాంపియన్ జట్టేనా..? ధోనీని.. చెన్నై జట్టును ఇలా చూడటం చాలా బాధగా ఉంది. ‘2020’ నిజంగానే చెడ్డది’’ ప్రస్తుత సీజన్లో ధోనీసేన పరిస్థితి
డీలాపడ్డ ఛాంపియన్ జట్టు
‘‘అరెరే.. మన చెన్నై జట్టుకు ఏమైంది..? ఎందుకిలా డీలా పడిపోయింది. ఇప్పుడున్న ధోనీసేన.. గతంలోని ఛాంపియన్ జట్టేనా..? ధోనీని.. చెన్నై జట్టును ఇలా చూడటం చాలా బాధగా ఉంది. ‘2020’ నిజంగానే చెడ్డది’’ ప్రస్తుత సీజన్లో ధోనీసేన పరిస్థితి చూశాక బహుశా సగటు చెన్నై అభిమాని ఆవేదన ఇదే కావచ్చు.
గతంలో.. చెన్నై జట్టు ముందు కొండంత లక్ష్యం ఉన్నా ఛేదిస్తుందనే ధైర్యం ఉండేది. కారణం.. రైనా. అతను లేక ఇప్పుడు ఛేదనలో చతికలపడిపోతోంది. చేజారిపోతున్న మ్యాచ్లనూ చేజిక్కించుకుంటుందనే ధీమా ఉండేది. కారణం.. బ్రావో. అతను లేక ఇప్పుడు చేతిలోని మ్యాచ్లను ప్రత్యర్థులు లాగేసుకుంటున్నా నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోతోంది. మరి చెన్నై ఓటములకు ఇవే కారణాలా..? అంటే.. అందులో ప్రధానంగా ఈ రెండు సమాధానాలే ఎదురు కావొచ్చు! ఎందుకంటే వాళ్లిద్దరూ ఉన్నప్పుడు చెన్నై ప్రదర్శన ఇంత చెత్తగా ఎన్నడూ లేదు.
చరిత్ర ఘనం.. వర్తమానం శూన్యం..
ధోనీసేన ఏకంగా ఎనిమిది సార్లు ఫైనల్స్కు చేరింది. మూడుసార్లు టైటిల్స్ను గెలిచింది. ప్రతిసారీ ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత బలమైన జట్లలో ఒకటి. అందుకే.. అన్ని జట్లు ప్లేఆఫ్స్ తొలి లక్ష్యంగా బరిలోకి దిగితే చెన్నై మాత్రం నేరుగా ఫైనల్పై గురిపెట్టేది. క్రికెట్ విశ్లేషకులు సైతం ఫైనల్లో ఒక బెర్తును ముందుగానే చెన్నైకి ఖాయం చేసేవారు. మిగిలిన స్థానం కోసం పోటీపడే జట్ల గురించి మాట్లాడేవారు. అయితే.. ఈసారి పరిస్థితి మారింది. గత ఛాంపియన్కు ఇప్పుడున్న ధోనీసేన ప్రదర్శనకు చాలా తేడా ఉంది. ఆడిన పది మ్యాచుల్లో ఏడు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది. ఫలితంగా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. చెన్నై ఇప్పటికీ ప్లేఆఫ్కు చేరే అవకాశం ఉంది. కానీ.. అది ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధోనీ సేన ప్లేఆఫ్స్కు వెళ్లడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
కొంపముంచిన టెస్టు బ్యాటింగ్..
ఇది టీ20. ఎదురొచ్చిన ప్రతి బంతినీ పరుగులు పెట్టించాలి. పవర్ప్లే, మధ్య ఓవర్లు, ఆఖరి ఓవర్లు అని తేడా లేకుండా బౌండరీలు బాదాలి. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచాలి. జట్టు ముందు కొండంత లక్ష్యం ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఛేదించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పొట్టి క్రికెట్కు కావాల్సింది దూకుడు. చెన్నై జట్టులో అదే కొరవడింది. కావాల్సినంత అనుభవం ఉన్నా.. దూకుడుగా ఆడే ఆటగాళ్లు లేరు. చివర్లో బౌండరీలు బాదే హిట్టర్లు కనిపించడంలేదు. వికెట్లు కాపాడుకొని చివరి ఓవర్లలో స్కోర్ బోర్డును పరిగెత్తిద్దాం అన్నట్లు ధోనీ సేన ఆటతీరు సాగింది. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఈ విషయం కళ్లకు కట్టినట్లుగా అర్థమైంది. వికెట్లు కాపాడుకుంటే విజయం సాధించడానికి ఇది టెస్టు మ్యాచ్ కాదుగా..! అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అన్నింటికంటే ముఖ్యంగా ధోనీసేనలో గెలవాలనే కసి కనిపించలేదు. ఈ కారణంగానే ఈసారి కనీసం ప్లేఆఫ్స్కు కూడా చేరలేకపోయింది.
ఇవే కారణాలు..!
* రైనా లేకపోవడం. అతనికి ప్రత్యామ్నాయ ఆటగాడు లేకుండానే బరిలోకి దిగడం.
* కీలక సమయంలో ఆల్రౌండర్ బ్రావో జట్టుకు దూరం కావడం.
* గత సీజన్లో అత్యధిక వికెట్ల వీరుడు తాహీర్కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం.
* ఈ ఫార్మాట్కు సూట్కాని కేదార్ జాదవ్ను ఆల్రౌండర్గా జట్టులోకి తీసుకోవడం.
* తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఓపెనర్గా మంచి రికార్డున్న జగదీశన్ను ఆడించకపోవడం.
* జడేజా బ్యాటింగ్ను సరిగా వినియోగించుకోకపోవడం.
* జట్టులో యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేయకపోవడం.
* ఏళ్ల తరబడి ఒక్కటే జట్టుతో(ఆటగాళ్లను మార్చకుండా) మ్యాచ్లు ఆడటం.
* మ్యాచ్ గెలిపించే మంచి ఫినిషర్ లేకపోవడం.
* నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ.. చివర్లో వేగంగా ఆడదామనుకోవడం.
* విదేశీ ఆటగాళ్లను సక్రమంగా వినియోగించుకోలేకపోవడం.
* అన్నింటి కంటే ముఖ్యంగా ధోనీ ఫామ్లో లేకపోవడం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.