కోహ్లీని రెచ్చగొడితే.. నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడు
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఎక్కువగా రెచ్చగొడితే ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడని
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఎక్కువగా రెచ్చగొడితే ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో కోహ్లీతో తలపడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తన సహచరులకు సూచించాడు. ఇరు జట్ల మధ్యా ఎన్నో ఏళ్లుగా మాటల యుద్ధం జరుగుతోందని.. ఇప్పుడు కూడా అలా జరిగే అవకాశం ఉందని సందేహం వెలిబుచ్చాడు. ఇరు జట్లలో ఢీ అంటే ఢీ అనే ఆటగాళ్లుంటే కచ్చితంగా అలాంటివి చోటుచేసుకునే వీలుందన్నాడు. అయితే, ఇప్పుడు ఇరు జట్లలో మంచి వాతావరణం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీని రెచ్చగొట్టొద్దని ఫించ్ ఆస్ట్రేలియా ఆటగాళ్లను హెచ్చరించాడు.
ఒక వ్యక్తిగా మైదానం బయట కోహ్లీ ప్రశాంతంగా ఉంటాడని ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ చెప్పాడు. విరాట్ ఆటను అర్థం చేసుకొని మెలుగుతాడని తెలిపాడు. అలాగే ఐపీఎల్లో బెంగళూరు సారథిగా విరాట్ కోహ్లీ ప్రణాళికలు చూసి ఆశ్చర్యపోయానని ఫించ్ అన్నాడు. ప్రతి ఆటగాడి పట్ల చాలా నమ్మకంతో ఉంటాడన్నాడు. ఇదిలా ఉండగా, ఇటీవల పూర్తి అయిన పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆస్ట్రేలియా ఫించ్ కెప్టెన్సీలో 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుపొందగా, 1-2 తేడాతో పొట్టి సిరీస్ కోల్పోయింది. ఈ క్రమంలోనే ఈనెల 17 నుంచి రెండు జట్లూ 4 టెస్టుల సిరీస్లో తలపడనున్నాయి. అయితే, తొలి టెస్టు తర్వాత టీమ్ఇండియా సారథి భారత్కు తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క త్వరలో తల్లికాబోతున్నందున అతడు పితృత్వపు సెలవులు తీసుకున్నాడు.
ఇవీ చదవండి..
బ్యాట్తో చుక్కలు.. బంతితో నిప్పులు..
మరిన్ని డబుల్ ధమాకాలు రానున్నాయి: రోహిత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.