రోహిత్ కెప్టెన్ కాకుంటే టీమిండియాకే సిగ్గుచేటు
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు రోహిత్ శర్మను కెప్టెన్గా చేయాలని డిమాండ్ చేశాడు. అలా చేయకుంటే అది టీమ్ఇండియాకే సిగ్గుచేటని ఘాటుగా స్పందించాడు. ముంబయి ఐదోసారి...
గౌతమ్ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు
దిల్లీ: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు రోహిత్ శర్మను కెప్టెన్గా చేయాలని డిమాండ్ చేశాడు. అలా చేయకుంటే అది టీమ్ఇండియాకే సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ముంబయి ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత గౌతీ మాట్లాడాడు.
‘రోహిత్ శర్మ టీమ్ఇండియాకు సారథి కాకపోతే అది జట్టుకే నష్టం. అతడికి కాదు. జట్టు ఎంత పటిష్ఠంగా ఉంటుందో కెప్టెన్ కూడా అంతే ఉండాలి. దానిని నేను అంగీకరిస్తా. అయితే ఒక సారథి మెరుగైనవాడా? కాదా? అని ఎలా నిర్ణయించగలం? ఆ నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి. రోహిత్ ఐదుసార్లు ముంబయికి ట్రోఫీ అందించాడు’ అని గంభీర్ అన్నాడు.
‘భారత్లో ఎంఎస్ ధోనీ అత్యుత్తమ సారథి అని ఎప్పుడూ అంటాం. ఎందుకంటే అతడు రెండు ప్రపంచకప్లు, మూడు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు కాబట్టి. రోహిత్ సైతం ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచాడు. టోర్నీ చరిత్రలోనే అతడు అత్యంత విజయవంతమైన నాయకుడు. ఇంకా చెప్పాలంటే టీమ్ఇండియా పరిమిత ఓవర్ల సారథ్యం లేదా టీ20 నాయకత్వం అతడికి అప్పజెప్పకుంటే అది సిగ్గుచేటే. ఇంతకన్నా నిరూపించుకోవడానికి ఇంకేముంటుంది? అతడు టీమ్ఇండియా కెప్టెన్ కాకపోతే జట్టుకే నష్టం’ అని గౌతీ స్పష్టం చేశాడు.
ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీని తానేమీ తక్కువ చేయడం లేదని గంభీర్ అన్నాడు. అన్ని దేశాలు అవలంభిస్తున్న ఇద్దరు సారథుల వ్యూహం పనిచేస్తుందని నొక్కి చెబుతున్నా అన్నాడు. ‘బీసీసీఐ ఇద్దరు కెప్టెన్లను పరిశీలించాలి. ఎవ్వరూ తక్కువేమీ కాదు. తెల్ల బంతి క్రికెట్లో కోహ్లీ కన్నా తాను మెరుగైన సారథిగా రోహిత్ నిరూపించుకున్నాడు. 13 సీజన్లలో ఒక ఆటగాడు ఐదు టైటిళ్లు అందిస్తే మరొకరు ఏమీ చేయలేదు. రోహిత్, కోహ్లీ ఒకే వేదికపై నాయకత్వం వహించారు. ఒకే సమయంలో సారథులుగా ఉన్నారు. రోహిత్ విజయవంతం అయ్యాడు’ అని అన్నాడు.
ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సైతం గంభీర్తో ఏకీభవించాడు. రోహిత్శర్మ టీమ్ఇండియా టీ20 సారథిగా ఎంపికవ్వాలని పేర్కొన్నాడు. అతడికి టీ20లు ఎలా గెలవాలో తెలుసని ప్రశంసించాడు. ఇక మాజీ క్రికెటర్లు, అభిమానులు రోహిత్ను ప్రశంసల్లో ముంచెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.