ధోనీ అంటే అంతేగా.. అంతేగా!
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినీషర్ అని ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. తాజాగా ఆ జట్టు ఇంగ్లాండ్తో...
అలాంటోడి కోసం చూస్తున్నాం : పాట్కమిన్స్
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినీషర్ అని ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. తాజాగా ఆ జట్టు ఇంగ్లాండ్తో తలపడిన మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ను రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ జట్టు గెలిచే అవకాశమున్నా ప్రధాన బ్యాట్స్మెన్ తేలిపోయారు. చివరి 3 ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి ఉన్నా 25 పరుగుల దాకా నెట్టుకొచ్చారు. మార్కస్ స్టోయినిస్ వంటి మేటి బ్యాట్స్మన్ ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఓ మీడియాతో మాట్లాడిన కమిన్స్.. ధోనీని గుర్తు చేసుకున్నాడు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినీషర్ అని, అతడికున్న అనుభవంతో ఆ స్థాయికి చేరాడని చెప్పాడు. తాము కూడా మహీ వంటి ఫినీషర్ కోసం చూస్తున్నట్లు తెలిపాడు.
‘జట్టులో ఈ విషయంపై చర్చించాము. ప్రాక్టీస్ సెషన్లోనూ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్పై శ్రద్ధ తీసుకున్నాం. అక్కడ రాణించడం అంత తేలికైన పని కాదు, ఏ జట్టుకైనా కష్టతరమే. ఈ విషయంపై మా సెలెక్టర్లు, కెప్టెన్ కూడా చర్చించారు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. అయితే, ఫలితాలు ఇప్పుడే రావు. మాకు మంచి జట్టే ఉంది. సరైన ఆటగాళ్లు ఉన్నారు. అందరూ తగినన్ని మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నాడు. ఇక ఆరు నెలల తర్వాత మళ్లీ క్రికెట్ ఆడటంపై స్పందించి కమిన్స్.. ఇప్పుడు ఆటగాళ్ల ప్రదర్శనలో ఎటువంటి మార్పులు రాలేదని, అయితే, ఈ అనుభవం కొత్తగా ఉందని చెప్పాడు. ప్రేక్షకులు లేకుండా ఆడటం వల్ల స్టేడియంలో సందడి లేదన్నాడు. ఇది కాస్త కొత్తగా అనిపించినా తర్వాత అలవాటు పడ్డామన్నాడు. ఇంగ్లాండ్ వంటి దేశంలో ఇలా క్రికెట్ అభిమానులు లేక వారు పాడే పాటలు వినలేకపోయినట్లు చెప్పాడు. మరోవైపు ఈ సిరీస్లో ఇంగ్లాండ్ ఇప్పటికే శుభారంభం చేయగా నేడు జరిగే రెండో టీ20లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాలి. లేదంటే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆ జట్టు గెలిస్తే ఇక మంగళవారం చివరి మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంటుంది. అప్పుడు ఎవరు గెలిస్తే వారిదే సిరీస్ సొంతం అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం