‘ట్రంప్ బాబాయ్ కామెడీ మిస్ అవుతాం’
అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందడంతో ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు ఓటమిపాలైనా
అమెరికా ఎన్నికల ఫలితాలపై క్రికెటర్ల ట్వీట్లు
ఇంటర్నెట్డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందడంతో ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు ఓటమిపాలైనా తానే విజయం సాధించానని ట్విటర్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్పై కొందరు వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, వసీమ్ జాఫర్ కూడా ట్రంప్ ఓటమిపై సరదాగా ట్వీట్లు చేశారు.
‘‘మా వాళ్లు అలాగే ఉన్నారు. ట్రంప్ బాబాయ్ కామెడీ మిస్ అవుతాం’’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఎన్నికల ఫలితం వెలువడటానికి గంట ముందు ట్రంప్ చేసిన ట్వీట్పై వసీమ్ జాఫర్ పంచ్ వేశాడు. ‘‘ఈ ఎన్నికల్లో నేను గెలిచాను. భారీ విజయం’’ అని ట్రంప్ చేసిన ట్వీట్ను పోస్ట్ చేసి.. ‘‘ఈ సీజన్లో పంజాబ్ ట్రోఫీ గెలిచింది. భారీ విజయం’’ అని ట్వీటాడు. ప్రస్తుతం జరుగుతున్న 13వ సీజన్లో పంజాబ్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆ జట్టు ట్రోఫీని అందుకోలేదు. ఈ సీజన్లో పంజాబ్కు జాఫర్ బ్యాటింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు.
అయితే ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధిస్తారని రాజస్థాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ముందే ఊహించి ట్వీట్ చేశాడని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని 2014 అక్టోబర్లోనే ట్వీట్ చేశాడని నెటిజన్లు తెలుపుతున్నారు. ఆర్చర్ పోస్ట్ చేసిన ‘జో’ అనే ట్వీట్ను రాజస్థాన్ జట్టు కూడా రీట్వీట్ చేసింది. ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన జోఫ్రా ఆర్చర్ను నోస్ట్రాడామస్గా పిలుస్తుంటారు. అతడు భవిష్యత్తులో జరిగే విషయాలను ముందుగానే ఊహించి ట్వీట్లు చేస్తుంటాడని అంటుంటారు. యాదృచ్ఛికంగా అవి నిజమే అన్నట్టుగా ఉంటాయి. క్రిస్గేల్ 99 పరుగుల వద్ద ఔట్, ప్రధాని 21 రోజుల లాక్డౌన్, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ ఓవర్, వరుసగా 4 సిక్సులు, ఒకే ఓవర్లో 30 పరుగులు.. ఇలా ఆర్చర్ చేసిన ట్వీట్లు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు