లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు.
నేడు డైమండ్ లీగ్ తొలి అంచె పోటీలు
దోహా: ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ఈ సీజన్ను మెరుగ్గా ఆరంభించాలని 26 ఏళ్ల నీరజ్ పట్టుదలతో ఉన్నాడు. చాలా రోజులుగా ఊరిస్తున్న 90 మీటర్ల దూరాన్ని కూడా అందుకోవాలని చూస్తున్నాడు. ఈ ప్రపంచ ఛాంపియన్కు అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), జాకబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), జులియన్ వెబర్ (జర్మనీ) నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. పోటీపడుతున్న 10 మంది జావెలిన్ త్రోయర్లలో మరో భారత క్రీడాకారుడు కిశోర్ జెనా కూడా ఉన్నాడు. డైమండ్ లీగ్ అరంగేట్రం చేయబోతున్న అతని వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన 87.54మీ. నీరజ్ చోప్రా ఉత్తమ ప్రదర్శన 89.94మీ.గా ఉంది. ఈ డైమండ్ లీగ్ రెండో అంచె పోటీలు మే 19న మొరాకోలో జరుగుతాయి.
90 మీ.అందుకుంటా: ఈ ఏడాది కచ్చితంగా 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంటానని నీరజ్ చెప్పాడు. ‘‘90మీ. అందుకుంటా అని గతేడాది చెప్పా కానీ 88మీ. దూరమే విసిరా. ఈ ఏడాది చెప్పను చేసి చూపిస్తా. 2018 ఆసియా క్రీడల్లో 88.06మీ. ప్రదర్శన చేసినప్పటి నుంచి జనాలు ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. కానీ ఆ తర్వాత చాలా విషయాలు జరిగాయి. మోచేతి గాయమైంది. శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 88మీ. నుంచి 90మీ. మధ్య ఉన్నా. ఈ ఏడాది కచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నా. 90మీ. ప్రదర్శనకు దోహా ప్రసిద్ధి అని నిరుడు చెప్పా. కానీ అప్పుడు ఎదురు గాలి వల్ల సాధించలేకపోయా. కానీ శుక్రవారం మనకు మంచి రోజవుతుంది. ఈ ఒలింపిక్స్లో పసిడి గెలవాలనే అంచనాలుంటాయి. కానీ ప్రపంచంలోని అత్యుత్తమ అథ్లెట్లు పోటీపడటం వల్ల అదంత సులువు కాదు. ఆరోగ్యంగా ఉంటూ టెక్నిక్పై ధ్యాస పెట్టడంపైనే నా దృష్టి. నేను ఆరోగ్యంగా ఉంటే అన్ని కుదురుతాయి’’ అని నీరజ్ తెలిపాడు. ఈ నెల 12న భువనేశ్వర్లో ఆరంభమయ్యే ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో నీరజ్ పోటీపడే అవకాశముంది. మూడేళ్లలో అతను స్వదేశంలో పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కానుంది. ‘‘ఆటే నాకు అన్నింటికంటే ముఖ్యమైంది. భారత్లో ఆడితే నాకూ మంచిదే. కానీ శుభకార్యాలు, వివాహాలు ఉండటంతో కుటుంబం, స్నేహితులతో సమయం గడపాల్సి ఉంది. అంతకంటే ముఖ్యంగా ఒలింపిక్ ఏడాది శిక్షణ కొనసాగించాలి. టోక్యో ఒలింపిక్స్ కంటే ముందు భారత్లో సాధన చేశా. కానీ ఇప్పుడు ఆటపైనే దృష్టి పెట్టిన నేను కొద్దికాలం తర్వాత తిరిగి భారత్లో ప్రాక్టీస్ కొనసాగిస్తా. కోహ్లి లేదా ధోనీలా కాదు కానీ నేనూ చాలా మంది జనాలకు తెలుసు. భారత్ వెళ్లినప్పుడు ప్రజలు నన్ను గుర్తుపడతారు. అథ్లెటిక్స్కు ఇది మంచిదే. ఒలింపిక్ పసిడి కారణంగా అథ్లెటిక్స్ గురించి తెలుసుకోవడంతో పాటు అనుసరిస్తున్నారు’’ అని నీరజ్ పేర్కొన్నాడు. బంధన (నుదురుపై చుట్టుకునే వస్త్రం) లేకుండా త్రో విసరలేరా అనే ప్రశ్నకు.. ‘‘లేదు. బంధన లేకుండా త్రో విసరడం మంచిది కాదు. ఫౌల్ లైన్ను చూడలేం’’ అని నవ్వుతూ నీరజ్ బదులిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మండిపడ్డాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ స్పందించింది. -
ప్లేఆఫ్స్ తొలి పోరు... రైడర్స్పై సన్ ‘రైజ్’ అయితే ఫైనల్కు!
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్లో జరిగే క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ (Sunrisers Hyderabad)ను కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఢీకొంటుంది. -
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసునని.. అది జట్టుకు కచ్చితంగా ఉపయోగపడుతుందని వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. -
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
Anand Mahindra: ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన బెంగళూరు జట్టు, కోహ్లీపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. కింగ్ కంటే స్ఫూర్తినిచ్చేవారు ఎవరుంటారని ప్రశంసించారు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
ఐపీఎల్ 17వ సీజన్లో లీగ్ స్టేజ్ను దాటి ప్లేఆఫ్స్ పోరు మొదలుకానుంది. అనూహ్య ఫలితాలతో నాకౌట్కు చేరి ఆశ్చర్చపరిచిన జట్లూ ఉన్నాయి. -
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
ఐపీఎల్ ముగిసిన తర్వాత.. దాదాపు వారం రోజుల్లో భారత ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్లో ఆడనున్నారు. ఇప్పటికే జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
ఉత్కంఠ పరిస్థితుల్లో ప్లేఆఫ్స్కు చేరుకున్న బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు కాస్త సమయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. -
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ప్లేఆఫ్స్కు చేరలేదు. దీంతో ధోనీ ఆటను చూసే అవకాశం కోల్పోయామనే బాధ అభిమానుల్లో ఉంది. అయితే, అతడి భవితవ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. -
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో ఓపెనర్గా అభిషేక్ శర్మదీ కీలక పాత్రే. మరో ఆటగాడు ట్రావిస్ హెడ్తో కలిసి అదిరే ఆరంభాలను ఇచ్చాడు. -
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. -
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..