భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
అయిదో టీ20లోనూ బంగ్లాపై విజయం
సిల్హెట్: బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట భారత్ 5 వికెట్లకు 156 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (33; 25 బంతుల్లో 4×4, 1×6), హేమలత (37; 28 బంతుల్లో 2×4, 2×6), హర్మన్ప్రీత్ (30; 24 బంతుల్లో 4×4), రిచా ఘోష్ (28 నాటౌట్; 17 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాధ యాదవ్ (3/24), ఆశ శోభన (2/25)ల ధాటికి బంగ్లా 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది.
మనిక జోరుకు తెర
జెడ్డా: గ్రాండ్స్మాష్ టీటీ టోర్నమెంట్లో భారత స్టార్ మనిక బత్రా సంచలనాలకు తెరపడింది. రెండో రౌండ్లో ప్రపంచ నంబర్-2 వాంగ్ మన్యూను కంగుతినిపించిన మనిక.. ప్రిక్వార్టర్స్లో 14వ ర్యాంకర్ నినా మిటిల్హమ్కు షాకిచ్చినా.. క్వార్టర్స్లో ఓడిపోయింది. మనిక 11-7, 6-11, 4-11, 11-13, 2-11తో అయిదో ర్యాంకర్ హినా హయటా (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది.
భారత షూటర్లు విఫలం
దిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత షూటర్ల వైఫల్యం కొనసాగుతోంది. బాకులో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం పురుషులు, మహిళల స్కీట్లో భారత క్రీడాకారులెవరూ ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. పురుషుల విభాగంలో అనంత్జీత్ సింగ్ 15, షీరజ్ షేక్ 54, మైరాజ్ అహ్మద్ఖాన్ 76వ స్థానాల్లో నిలిచారు. మహిళల్లో రైజా ధిల్లాన్ 16, మహేశ్వరి చౌహాన్ 20, గనేమత్ షెఖాన్ 25వ స్థానాలు సాధించారు. అంతకుముందు భారత ట్రాప్ షూటర్లు కూడా ఫైనల్ చేరడంలో విఫలమయ్యారు. పురుషుల విభాగంలో వివాన్ కపూర్కు ఫైనల్ బెర్తు త్రుటిలో చేజారింది. ఆరుగురు ఫైనల్కు వెళ్లే అవకాశం ఉండగా.. వివాన్ ఏడో స్థానం సాధించాడు. పృథ్వీ తొండమాన్ 24, భోనీష్ 39, జొరావర్సింగ్ 52వ స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో రాజేశ్వరి కుమారి 23వ స్థానం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు