NED vs AFG: నెదర్లాండ్స్పై విజయం.. అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు సజీవం..
లఖ్నవూ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో అఫ్గానిస్థాన్ విజయం సాధించింది.
లఖ్నవూ: క్రికెట్ వన్డే ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లఖ్నవూ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీస్ అవకాశాలు నిలబెట్టుకుంటూ.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. తొలుత నెదర్లాండ్స్ను 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ చేసిన అఫ్గాన్ జట్టు.. 31.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (10), ఇబ్రహీం జర్దాన్ (20) తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరినా, తర్వాత వచ్చిన రహ్మత్ షా (52; 54 బంతుల్లో 8 ఫోర్లు), షాహిది (56; 64 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అజ్మతుల్లా (31*) నాటౌట్గా నిలిచాడు.
లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గాన్కు ఆదిలోనే ఇబ్బంది ఎదురైంది. వాన్ బీక్ వేసిన 5.3వ బంతికి ఎడ్వర్డ్స్కి క్యాచ్ ఇచ్చి ఓపెనర్ రహ్మనుల్లా (10) ఔటయ్యాడు. అక్కడికి నాలుగు ఓవర్ల వ్యవధిలోనే వాన్ డెర్ బౌలింగ్లో మరో ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్ (20) బౌల్డయ్యాడు. అయితే, స్కోరు తక్కువగా ఉండటంతో అఫ్గాన్ జట్టు పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. తొలి డౌన్లో వచ్చిన రహ్మత్ షా క్రీజులో నిలదొక్కుకొని ఇన్నింగ్స్ నిర్మించాడు. జట్టు స్కోరు 129 పరుగుల వద్ద రహ్మత్ షా ఔటైనప్పటికీ.. షాహిది, అజ్మతుల్లా లక్ష్యాన్ని పూర్తి చేశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ను అఫ్గాన్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. తొలి ఓవర్లోనే కీలక బ్రెస్సి వికెట్ పడగొట్టి.. ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ముజీబ్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి బ్రెస్సీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ మ్యాక్స్ (42) క్రీజులో నిలదొక్కుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. తొలి డౌన్లో వచ్చిన అకెర్మన్ (29) నిరాశ కలిగించినా.. రెండో డౌన్లో వచ్చిన సైబ్రాండ్ (58) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడిపోతున్నా.. పట్టువిడువకుండా పరుగులు రాబట్టాడు. అయితే.. జట్టు స్కోరు 152 పరుగుల వద్ద రనౌట్గా వెనుదిరగడం జట్టుకు శరాఘాతంగా మారింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవరూ పెద్దగా ప్రదర్శన చేయకపోవడంతో.. నెదర్లాండ్స్ 179 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అఫ్గాన్ బౌలర్లలో నబి 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ 2, ముజీబ్ ఒక వికెట్ తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం