Bangalore: ఒకే మ్యాచ్లో పంజాబ్ గొప్ప రికార్డు.. బెంగళూరు పేలవ రికార్డులు
బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన తొలిపోరులో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో ఈ మెగా టోర్నీ...
ఇంటర్నెట్డెస్క్: బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన తొలిపోరులో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో ఈ మెగా టోర్నీ మొత్తంలో అత్యధికంగా నాలుగు సార్లు 200 పై చిలుకు స్కోర్లను ఛేదించిన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యంకాని గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ జాబితాలో చెన్నై మూడుసార్లు 200కు పైగా లక్ష్యాలను ఛేదించి రెండో స్థానంలో నిలిచింది.
మరోవైపు బెంగళూరు నాలుగు సార్లు ఈ టోర్నీలో 200పై చిలుకు లక్ష్యాలను కాపాడుకోలేకపోయి అనవసరపు రికార్డును సొంతం చేసుకుంది. అలాగే ఇదే మ్యాచ్లో 21 వైడ్లు వేయడం ద్వారా.. టోర్నీ మొత్తంలోఒక్క మ్యాచ్లో అత్యధిక వైడ్లు వేసిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. గతంలో పంజాబ్ 2011లో కొచీ టస్కర్స్తో తలపడిన మ్యాచ్లో అత్యధికంగా 19 వైడ్లు వేసి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండేది. ఇప్పుడు దాన్ని బెంగళూరు అధిగమించింది. అలాగే 2008లో రాజస్థాన్పై, 2018లో ముంబయిపైనా బెంగళూరు 18 వైడ్లు వేసింది. ఇక రాజస్థాన్ 2015లో కోల్కతాపై 18 వైడ్లు వేసి ఈ జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం