NZ vs BAN: బంగ్లా ఆటగాళ్ల మిస్ ఫీల్డింగ్.. ఒక్క బంతికే 7 పరుగులు
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు ఆటగాళ్లు మిస్ఫీల్డింగ్ చేయడంతో న్యూజిలాండ్ ఒక్క బంతికే ఏడు పరుగులు సాధించింది. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది...
ఇంటర్నెట్డెస్క్: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు ఆటగాళ్లు మిస్ఫీల్డింగ్ చేయడంతో న్యూజిలాండ్ ఒక్క బంతికే ఏడు పరుగులు సాధించింది. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు. క్రైస్ట్చర్చ్ వేదికగా హాగ్లే ఓవల్ మైదానంలో ఆదివారం ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోగా న్యూజిలాండ్ బ్యాటింగ్కు దిగింది. టామ్ లాథమ్, విల్యంగ్ ఓపెనర్లుగా వచ్చి తొలి సెషన్లో 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే భోజన విరామం అనంతరం ఎబాడత్ హుస్సేన్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి ఈ సరదా సంఘటన చోటుచేసుకుంది.
విల్యంగ్(55) ఆడిన ఆ బంతి నేరుగా తొలి స్లిప్లోని ఫీల్డర్ వైపు వెళ్తుండగా రెండో స్లిప్లో ఉన్న మరో ఫీల్డర్ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అతడు ఎడమచేతి వైపు డైవ్చేస్తూ క్యాచ్ పడదామనుకున్నాడు. కానీ, ఆ బంతి చేజారి ఫైన్ లెగ్ దిశగా బౌండరీ వైపు పరుగులు తీసింది. దాంతో అటువైపు ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు చివరి క్షణాల్లో ఆ బంతిని నిలువరించి కీపర్కు విసిరాడు. ఆ సమయంలో కివీస్ ఓపెనర్లు మూడో పరుగు తీస్తుండగా.. బంగ్లా కీపర్ బంతిని నాన్స్ట్రైకింగ్ ఎండ్లో వికెట్లకేసి కొట్టాడు. దీంతో ఆ బంతి మరోసారి అటువైపు ఉన్న ఫీల్డర్లను దాటుకొంటూ బౌండరీకి చేరింది. దాని వెనకాలే పరుగెత్తుకుంటూ వచ్చిన ఫీల్డర్ ఎంత ప్రయత్నించినా చవరికి బంతి బౌండరీని తాకింది. దీంతో న్యూజిలాండ్ ఓపెనర్ విల్యంగ్ ఒకే బంతికి ఏడు పరుగులు సాధించాడు. కాగా, ఇప్పటికే తొలి టెస్టు కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ ఈసారి రెండో టెస్టును కూడా సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ తొలి టెస్టు పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.