IPL Postpone: ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అడగం కానీ.. 

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్ధాంతరంగా వాయిదా పడటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే భారత్‌ నుంచే వచ్చే ప్యాసింజర్‌ విమానాలను...

Published : 05 May 2021 02:25 IST

కంగారూ ఆటగాళ్ల పట్ల క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏమనిందంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్ధాంతరంగా వాయిదా పడటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే భారత్‌ నుంచే వచ్చే ప్యాసింజర్‌ విమానాలను అక్కడి ప్రభుత్వం మే 15 వరకు తాత్కాలికంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో ఐపీఎల్‌లో ఆడుతున్న కంగారూ క్రికెటర్లు ఇప్పుడు తిరిగి ఇళ్లకు చేరుకునే విషయంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ), ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌(ఏసీఏ) మంగళవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

‘మే 15 వరకు భారత్‌ నుంచే వచ్చే విమానాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన విషయాన్ని మేం గౌరవిస్తున్నాం. అందులో మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరలేము. అయితే.. ఆస్ట్రేలియా క్రికెటర్లు, వ్యాఖ్యాతలు, కోచ్‌లు, ఇతర సిబ్బంది తిరిగి క్షేమంగా ఇక్కడికి వచ్చే విషయంపై బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఆ బోర్డుతో క్రికెట్‌ ఆస్ట్రేలియా నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. అందుకు బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడి ఆటగాళ్లను క్షేమంగా స్వదేశానికి చేర్చేలా కష్టపడుతోంది. అలాగే ఐపీఎల్‌ 14వ సీజన్‌ను ఇలా నిరవధికంగా వాయిదా వేయడాన్ని మేం అర్థం చేసుకోగలం’ అని సీఏ, ఏసీఏ అందులో పేర్కొన్నాయి. 

మరోవైపు విదేశీ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తిరిగి వారి స్వస్థలాలకు క్షేమంగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఐపీఎల్ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ మంగళవారం పీటీఐతో అన్నారు. ఇక అంతకుముందు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన వెంటనే ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని