ZIM vs IND: భారత్ 26 ఓవర్లలోనే ఛేదించింది.. అదే మా టీమ్ 50 ఓవర్లు ఆడేది!
జింబాబ్వేపై మూడు వన్డేల సిరీస్ను భారత్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్లో అలవోకగా పది వికెట్ల తేడాతో...
పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా వ్యాఖ్యలు
ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేపై మూడు వన్డేల సిరీస్ను భారత్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్లో అలవోకగా పది వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమ్ఇండియా.. రెండో వన్డేలో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే 26 ఓవర్లలోపే 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో జింబాబ్వేపై స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఐదు వికెట్లను కోల్పోవడంపై పాక్ అభిమానులు తమ సోషల్ మీడియాలో అక్కసు వెళ్లగక్కారు. అయితే ఆ జట్టుకే చెందిన మాజీ ఆటగాడు డానిష్ కనేరియా మాత్రం టీమ్ఇండియా బ్యాటింగ్ ప్రణాళికను అభినందించాడు. అదే క్రమంలో పాకిస్థాన్ అయితే మరింత శ్రమించాల్సి వచ్చేదని అభిప్రాయపడ్డాడు.
‘‘చాలా మంది పాకిస్థాన్ అభిమానులు భారత్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించడంపై కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ వికెట్లు నష్టపోయినప్పటికీ.. టీమ్ఇండియా దూకుడుగా బ్యాటింగ్ చేసిందనే విషయాన్ని మరిచిపోకూడదు. ఎందుకంటే కేవలం 26 ఓవర్లలోపే 162 పరుగులను ఛేదించింది. ఇదే పరిస్థితి పాకిస్థాన్కు వస్తే మాత్రం.. 50 ఓవర్లను తీసుకునేది. ఇక ఆసియా కప్కు షహీన్ షా అఫ్రిది దూరం కావడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డే బాధ్యత వహించాలి. అన్ని ఫార్మాట్లలో అతడిని ఆడించవద్దని గతంలోనే చెప్పా. శ్రీలంకతో సిరీస్కు ఎంపిక చేయకుండా ఉండాల్సింది. ఏదోఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని గ్రహించా. కానీ, మెగా టోర్నీ ముందు ఇలా జరగడం బాధాకరం’’ అని డానిష్ కనేరియా తెలిపాడు. ఆసియా కప్లో ఆగస్ట్ 28న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!