WTC Final: అజింక్యపై ఒత్తిడి పెంచొద్దన్న ఎమ్మెస్కే

టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెపై అనవసరంగా ఒత్తిడి పెంచొద్దని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ అతడు నిలబడతాడని పేర్కొన్నారు. ప్రతి మ్యాచులోనూ పరుగులు చేయాలన్న అనవసర భారం అతడిపై మోపొద్దని సూచించారు.....

Updated : 08 Jun 2021 17:01 IST

ముంబయి: టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెపై అనవసరంగా ఒత్తిడి పెంచొద్దని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ అతడు నిలబడతాడని పేర్కొన్నారు. ప్రతి మ్యాచులోనూ పరుగులు చేయాలన్న అనవసర భారం అతడిపై మోపొద్దని సూచించారు.

‘అజింక్య రహానె మంచి ఆటగాడు. అతడు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. కానీ జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ అతడు నిలబడ్డాడు. అతడికా సత్తా ఉంది. అతడు కొన్నిసార్లు పరుగులు చేయకపోవచ్చు. అందుకని జట్టు కఠిన నిర్ణయం తీసుకుంటుందని అనుకోను’ అని ఎమ్మెస్కే అన్నారు.

‘జింక్స్‌ ఘనంగా పుంజుకుంటాడు. అతడు జట్టు మనిషి. అందరూ అతడిని ఇష్టపడతారు. విరాట్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడని ప్రతిసారీ అజింక్య ముందుకొస్తాడు. సీనియర్లు లేకున్నా ఆస్ట్రేలియాలో సారథిగా, ఆటగాడిగా అతడెలా రాణించాడో మనం మర్చిపోవద్దు. అతనెప్పుడో నిరూపించుకున్నాడు. మిగతా భారత ఆటగాళ్ల కన్నా విదేశాల్లో అతడి రికార్డులు ఎంతో బాగున్నాయి. సొంతగడ్డపైనే అతడు కాస్త ఇబ్బంది పడ్డాడేమో. అందుకే అతడిపై అవసరమైన ఒత్తిడి చేయొద్దు’ అని ఎమ్మెస్కే వెల్లడించారు.

ప్రస్తుతం రహానె ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సిద్ధమవుతున్నాడు. ఛాంపియన్‌షిప్‌లో అతడు 17 మ్యాచులాడి 3 శతకాలతో 1095 పరుగులు చేయడం గమనార్హం. భారీ స్కోర్లు చేసేందుకు ఇబ్బంది పడ్డప్పటికీ అతడు జట్టుకు విజయాలే అందించాడు. ఆసీస్‌లో అతడి ప్రదర్శనలను ఎంత మెచ్చుకున్నా తక్కువే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని