Gautham gambhir: భారత టీ20 లీగ్పై అలాంటి ఆరోపణలు సరికాదు: గౌతమ్ గంభీర్
భారత టీ20 లీగ్ వల్లే భారత ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లలో రాణించలేకపోతున్నారనే వ్యాఖ్యలతో తాను విభేదిస్తానని గౌతమ్ గంభీర్ అన్నాడు.
దిల్లీ: భారత టీ20 లీగ్ వల్లే భారత ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లలో రాణించలేకపోతున్నారనే వ్యాఖ్యలతో తాను విభేదిస్తానని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చిన ఈ లీగ్పై ఇటువంటి ఆరోపణలు తనను బాధిస్తున్నాయన్నాడు. ఎఫ్ఐసీసీఐ, ప్రధాన క్రీడల విభాగం ఛైర్పర్సన్ సన్జోగ్ గుప్తా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న అనంతరం గంభీర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘భారత టీ20 లీగ్ రాకతో మన దేశంలో క్రికెట్కు గొప్ప మేలు జరిగింది. ఈ లీగ్ ప్రారంభమైన సమయం నుంచే దీనిపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఐసీసీ టోర్నమెంట్లలో బాగా ఆడలేకపోతే అందుకు బాధ్యులను చేయాల్సింది ఆటగాళ్లను, వారి ప్రదర్శనను. కానీ టీమ్ఇండియా వైఫల్యం చెందిన ప్రతిసారి అంతా ఈ లీగ్నే తప్పుపడుతుంటారు. అది సరైంది కాదు. ఒక క్రీడాకారుడు 35-36 ఏళ్ల వయసు వరకే సంపాదించగలడు. వారికి ఆర్థిక భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యం. అది టీ20 లీగ్ కారణంగా తీరుతుంది. దీని ద్వారా పొందే ఆదాయం అట్టడుగు స్థాయి నుంచి వారి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతోంది‘‘ అంటూ వివరించాడు.
అదే సమయంలో భారత టీ20 లీగ్లో స్వదేశీ కోచ్ల అవసరాన్ని వివరిస్తూ.. ‘‘ ప్రస్తుతం టీమ్ఇండియాలో భారత కోచ్లకు సరైన ప్రాధాన్యం ఇస్తూ బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. భారత జట్టుకు కోచ్గా భారతీయుడే ఉండాలని నేను బలంగా కోరుకుంటాను. ఎందుకంటే ఈ ఆట ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నది. దానిని అనుభూతి చెందిన వారే జట్టును సమర్థంగా నడిపించగలరు. లఖ్నవూ జట్టు మెంటార్గా.. ఈ లీగ్లో అన్ని జట్లకు భారతీయ కోచ్లే ఉండటం నేను చూడాలనుకుంటున్నా. మనం విదేశీ కోచ్లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. కానీ వారు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికే ఇక్కడకు వస్తుంటారు. మన ఆటగాళ్లకు బిగ్ బాష్ వంటి ఇతర విదేశీ లీగ్ల్లో కోచ్ బాధ్యతలు అప్పగించరు. క్రికెట్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. మనవారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి’’అంటూ తెలిపాడు. బీసీసీఐ తన నిధుల నుంచి 50 శాతాన్ని ఇతర ఒలింపిక్ క్రీడల కోసం వెచ్చించాలని కోరాడు. ఒడిశా అనుసరిస్తున్నట్టుగా ఏదైనా ఒక క్రీడను దేశం తరఫున ముందుకు తీసుకెళ్లాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.