IND vs BAN: వాళ్లు టీమ్ఇండియా ఆటగాళ్లలా కనిపించడం లేదు.. మాజీ కోచ్ మండిపాటు
టీమ్ఇండియా బలహీనమైన ప్రదర్శనను తీవ్రంగా పరిగణించాలంటూ మాజీ కోచ్ మదన్ లాల్ అన్నాడు.
దిల్లీ: ప్రస్తుత ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే అసలు వీరు టీమ్ఇండియా(Team india) జట్టులోనే ఉన్నారా అనే అనుమానం కలుగుతోందంటూ భారత మాజీ కోచ్ మదన్ లాల్(Madan lal) ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లా(Bangladesh)తో తొలి వన్డేలో 1 వికెట్ తేడాతో ఓడిన భారత్.. రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై ఈ మాజీ కోచ్ విరుచుకుపడ్డాడు.
‘‘వారు టీమ్ఇండియా ఆటగాళ్లలా కనపడటం లేదు. దేశం కోసం ఆడాలన్న మక్కువ.. మునుపటి జోష్ లోపించింది. వారు విపరీతంగా అలసిపోయైనా ఉండాలి. లేక ఏదో అలా నెట్టుకొస్తున్నట్టుగానైనా ఆడుతుండాలి. దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది’’ అంటూ ఈ మాజీ కోచ్ వ్యాఖ్యానించాడు. ఇక ఆటగాళ్ల ఫిట్నెస్పై ఇటీవల రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై కూడా మదన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘‘ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటే భారత టీ20 లీగ్ సమయంలోనే తీసుకోవాలి. దేశం తరఫున ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఐసీసీ ట్రోఫీలను నిర్లక్ష్యం చేస్తే మన దేశ క్రికెట్ పతనమైపోతుంది. ఇటీవల టీమ్ఇండియా టాప్ ఆర్డర్ ఆటతీరు ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. గత మూడేళ్లకాలంలో సీనియర్ ఆటగాళ్లు నమోదు చేసిన శతకాలు ఎన్ని? పోనీ పోయిన ఏడాదిలో ఎన్ని చేశారు? వయసు రీత్యా వారికి కంటికి, చేతికి మధ్య సమన్వయం లోపిస్తోంది. కానీ, అనుభవమున్న టాప్ ఆర్డర్ ఆడలేకపోతే గెలుపు అవకాశాలు మనకు దూరమైనట్టే’’ అంటూ మదన్ పేర్కొన్నాడు. ఇతర దేశాలు ఒక్కో ఫార్మాట్లో దానికి అనువైన నైపుణ్యాలున్న ఆటగాళ్లతో ఆడిస్తున్నాయని.. మనమెందుకు అలా చేయకూడదని ప్రశ్నించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.