ఐఎస్‌ఎల్‌ ఛాంప్‌ ముంబయి

ముంబయి సిటీ ఎఫ్‌సీ రెండోసారి ఐఎస్‌ఎల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్‌ బగాన్‌పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్‌ కమింగ్స్‌ గోల్‌తో మొదట మోహన్‌ బగాన్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్‌ (53వ) గోల్‌తో ముంబయి స్కోరు సమం చేసింది.

Published : 05 May 2024 02:10 IST

కోల్‌కతా: ముంబయి సిటీ ఎఫ్‌సీ రెండోసారి ఐఎస్‌ఎల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్‌ బగాన్‌పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్‌ కమింగ్స్‌ గోల్‌తో మొదట మోహన్‌ బగాన్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్‌ (53వ) గోల్‌తో ముంబయి స్కోరు సమం చేసింది. 81వ నిమిషంలో బిపిన్‌ సింగ్‌ గోల్‌తో ముంబయి 2-1 ఆధిక్యం సంపాదించింది. స్కోరు సమం చేయడానికి మోహన్‌ బగాన్‌ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆఖర్లో సబ్‌స్టిట్యూట్‌ జాకుబ్‌ వోటస్‌ (90+7) గోల్‌ కొట్టడంతో ముంబయి 3-1తో ముగించింది. ఐఎస్‌ఎల్‌ కప్పు నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలవాలనుకున్న మోహన్‌ బగాన్‌కు నిరాశ తప్పలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని