జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
లండన్: ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది. ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు ఎంపికలో ఏఐ సాయం తీసుకున్నట్లు ప్రధాన కోచ్ జాన్ లూయిస్ వెల్లడించాడు. దీని కారణంగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కూడా గెలిచామన్నాడు. 2023 మహిళల ప్రిమియర్ లీగ్లో యూపీ వారియర్స్కు కోచ్గా ఉన్న సమయంలో తనకు ఈ సాంకేతికత అందిస్తున్న లండన్ సంస్థ పీఎస్ఐ గురించి తెలిసిందని లూయిస్ పేర్కొన్నాడు. గతేడాది మహిళల యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఒకే రకమైన నైపుణ్యాలు ఉన్న ఇద్దరు క్రికెటర్లలో ఒకరిని ఎంచుకునేందుకు ఏఐ సాంకేతికత సాయపడిందని అతనన్నాడు. ‘‘ఓ ప్రత్యర్థిపై తాము అనుకున్న జట్టు కూర్పు సరిపోతుందో లేదో చూసుకునేందుకు సాంకేతికత ఉపయోగపడుతోంది. విభిన్న లైనప్లను సంస్థకు పంపిస్తా. వాళ్లు ఏఐ సాయంతో పరీక్షించి ఫలితాలు పంపిస్తారు. జట్టును పూర్తిగా ఇలాగే ఎంపిక చేస్తామని కాదు. ఇది ఎంపికలో ఓ భాగం మాత్రమే. నిరుడు యాషెస్లో దీన్ని విజయవంతంగా ఉపయోగించాం. ముఖ్యంగా ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు ఏఐ నిర్ణయం మాకు కలిసొచ్చింది. టీ20 సిరీస్ గెలిచేందుకూ సాయపడింది’’ అని లూయిస్ చెప్పాడు. మరోవైపు రగ్బీ, ఫుట్బాల్ జట్టు వ్యవహారాలు చూసుకునే కోచ్ స్టీవ్ బోర్త్విక్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాడు.
ఐపీఎల్కు మయాంక్ దూరం
లఖ్నవూ: బుల్లెట్ బంతులతో అందరి దృష్టిలో పడిన ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఐపీఎల్-17లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పటికే గాయం కారణంగా కొన్ని మ్యాచ్లు ఆడలేకపోయిన ఈ లఖ్నవూ సూపర్ జెయింట్స్ పేసర్.. ముంబయి ఇండియన్స్తో మ్యాచ్తో పునరాగమనం చేశాడు. కానీ పక్కటెముకల గాయంతో అతడు మిగిలిన మ్యాచ్లను ఆడే పరిస్థితుల్లో లేడని కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పాడు.
ఆ నిబంధన లేకుంటే..
ముంబయి: టీ20 ప్రపంచకప్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన లేకపోవడం కెప్టెన్లను మరింత వ్యూహాత్మకంగా ఆలోచించేలా చేస్తుందని కోల్కతా నైట్రైడర్స్, ఆస్ట్రేలియా ఫాస్ట్బౌలర్ మిచెల్ స్టార్క్ అన్నాడు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘‘ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఇక్కడి పిచ్లు, మైదానాల స్వభావం అది. ఇందులో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన పాత్ర కూడా ఉంది. బ్యాటర్లు, బ్యాటింగ్ ఆల్రౌండర్లు 8, 9వ స్థానాల్లో వస్తున్నారంటే.. చాలా లోతైన లైనప్ ఉందని అర్థం. పవర్ప్లే సందర్భంగా బ్యాటర్లలో భయమే ఉండట్లేదు. భారీ షాట్లు ఆడమే లక్ష్యం. ఆటగాళ్లు బాగా బ్యాటింగ్ చేస్తున్నారనడంలో సందేహం లేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కేవలం నిబంధన వల్లే ఆ స్కోర్లు అని చెప్పలేను’’ అని స్టార్క్ అన్నాడు. ‘‘ఐపీఎల్లో కొందరు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అద్భుత భాగస్వామ్యాలు నమోదయ్యాయి. అయితే వచ్చే నెల ప్రపంచకప్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన లేదు. అది స్కోర్లను ప్రభావితం చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రభావితం చేస్తుందనే అనుకుంటున్నా. ఆల్రౌండర్ల పాత్ర మళ్లీ కీలకమవుతుంది. కేవలం 11 మంది ఆటగాళ్లే ఉండడం వల్ల కెప్టెన్లు మరింత వ్యూహాత్మకంగా ఆలోచించాల్సివుంటుంది’’ అని చెప్పాడు.
ఆ బాక్సర్.. ఇప్పుడు పోలీస్గా
డ్రగ్స్పై అవగాహన కల్పించిన అఖిల్
దిల్లీ: డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలు నాశనమవడమే కాకుండా కుటుంబాలూ ఛిన్నాభిన్నం అవుతాయని మాజీ బాక్సర్ అఖిల్ కుమార్ పేర్కొన్నాడు. ఈ 2006 కామన్వెల్త్ క్రీడల పసిడి విజేత ప్రస్తుతం హరియాణాలోని జజ్జర్ పోలీసు విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పని చేస్తున్నాడు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే ముప్పుపై యువ బాక్సర్లు సహా 100 మందికి పైగా అథ్లెట్లకు అతను అవగాహన కల్పించాడు. ‘‘ఓ అథ్లెట్గా, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ ప్యానల్ సభ్యుడిగా డ్రగ్స్ వాడితే కలిగే ప్రమాదాన్ని అర్థం చేసుకున్నా. అందుకే అలాంటివి వాడకుండా ఎలా ఉండాలో అని వాళ్ల (అథ్లెట్లు)కు ప్రాథమిక సూచనలిచ్చా. సాధారణ వైద్య పరీక్షల సమయంలోనూ తాము అథ్లెట్లమని వైద్యులకు చెప్పాలి. అలా అయితే నిషేధిత ఉత్ప్రేరకాలను వైద్యులు సూచించరు. డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుంటున్న యువత కేవలం వాళ్ల జీవితాలను పాడు చేసుకోవడమే కాదు తల్లిదండ్రుల ఆశలనూ కూలుస్తుంది. డ్రగ్స్కు అలవాటు పడి కుటుంబాలనూ ఛిన్నాభిన్నం చేస్తున్నారు. అలాగే తాగుడుతో ఎవరూ ప్రయోజనం పొందరు. మరింత కిందకి పడిపోతారు’’ అని 43 ఏళ్ల అఖిల్ తెలిపాడు. కెరీర్లో ఉత్తమ స్థితిలో ఉన్నప్పుడు అఖిల్ 2008 ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్లో అప్పటి ప్రపంచ నంబర్వన్ సెర్గీ వొడోప్యానోవ్పై గెలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
భారత క్రికెట్ రూపురేఖలను మార్చడంలో ఎంఎస్ ధోనీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాగే విరాట్ వంటి ఆటగాళ్లను మెరుగ్గా రాణించడంలోనూ ధోనీదే ముఖ్య భూమిక. ఈ మాట అంటున్నది భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. -
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ఇండియాకు ఎంపికైన ఆటగాళ్లు త్వరలోనే అమెరికాలో అడుగు పెట్టనున్నారు. అందరూ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా వెళ్లే అవకాశం ఉంది. -
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్లో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
ఐపీఎల్ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు. -
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. -
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు