Womens T20 League: మహిళల టీ20 లీగ్.. రాష్ట్రాల సంఘాలకు గంగూలీ కీలక సమాచారం!
భారత్ టీ20 లీగ్కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో తెలుసు కదా... అలాగే మహిళలకూ ప్రత్యేకంగా టీ20 లీగ్ను నిర్వహించాలని మాజీలు సహా ప్రస్తుత క్రికెటర్ల నుంచి...
ఇంటర్నెట్ డెస్క్: భారత్ టీ20 లీగ్కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో తెలుసు కదా.. అలాగే మహిళలకూ ప్రత్యేకంగా టీ20 లీగ్ను నిర్వహించాలని మాజీలు సహా ప్రస్తుత క్రికెటర్ల నుంచి విజ్ఞప్తులు భారీగా వచ్చాయి. టీ20 ఛాలెంజ్ పేరిట కొన్ని మ్యాచ్లను నిర్వహిస్తున్నప్పటికీ.. తమకూ ఇటువంటి లీగ్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు గురువారం కీలక సమాచారం తెలియజేశాడు. వచ్చే ఏడాది నుంచి మహిళల భారత టీ20 లీగ్ నిర్వహించే అవకాశం ఉందని గంగూలీ పేర్కొన్నాడు.
పురుషుల భారత టీ20 లీగ్కు సంబంధించి కూడా గంగూలీ కీలక ప్రకటన చేశాడు. కరోనాకు ముందు నిర్వహించినట్లు ‘సొంత మైదానం-బయట మైదానం’ తరహాలో వచ్చే సీజన్ను నిర్వహిస్తామని గంగూలీ పేర్కొన్నాడు. గత సీజన్ను కేవలం నాలుగు మైదానాలకే పరిమితం చేసిన విషయం తెలిసిందే. ‘‘ప్రస్తుతం బీసీసీఐ మహిళల టీ20 లీగ్పైనా కసరత్తు చేస్తోంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాం. అలాగే పురుషుల టీ20 లీగ్ కూడా గతంలో జట్టుకు సొంత మైదానాల్లో ఆడే అవకాశం ఉండేది. అయితే, కరోనా కారణంగా గత సీజన్లో కుదరలేదు. అందుకే వచ్చే సీజన్కు ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని గంగూలీ రాష్ట్రాలకు తెలిపినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం