డివైన్ దంచేసింది
సోఫీ డివైన్.. మహిళల ప్రిమియర్ లీగ్ చరిత్రలో ఈ పేరు చాన్నాళ్లు నిలిచిపోతుంది. లీగ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆమె రెచ్చిపోయింది.
36 బంతుల్లోనే 99 పరుగులు
లక్ష్యం 189.. 15.3 ఓవర్లలోనే ఉఫ్
బెంగళూరుకు సంచలన విజయం
సోఫీ డివైన్.. మహిళల ప్రిమియర్ లీగ్ చరిత్రలో ఈ పేరు చాన్నాళ్లు నిలిచిపోతుంది. లీగ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆమె రెచ్చిపోయింది. మహిళల క్రికెట్లో ఏం వేగం ఉంటుంది అని ప్రశ్నించేవాళ్లకు శనివారం నాటి ఆమె ఇన్నింగ్స్ గట్టి సమాధానమే. 36 బంతులు.. 9 ఫోర్లు.. 8 సిక్సర్లు.. 99 పరుగులు.. ఈ గణాంకాలు చాలు ఆమె ఎంతలా రెచ్చిపోయిందో చెప్పడానికి. సోఫీ మెరుపు ఇన్నింగ్స్తో 189 పరుగుల లక్ష్యాన్ని ఇంకో 27 బంతులుండగానే ఛేదించి సంచలనం సృష్టించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
వరుసగా అయిదు ఓటములతో డబ్ల్యూపీఎల్ను పేలవంగా ఆరంభించిన బెంగళూరు.. కొంచెం ఆలస్యంగా పుంజుకుంది. గత మ్యాచ్లో తొలి విజయాన్నందుకున్న ఆ జట్టు.. శనివారం గుజరాత్ జెయింట్స్ను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది.మొదట లారా వోల్వార్ట్ (68; 42 బంతుల్లో 9×4, 2×6), ఆష్లీ గార్డ్నర్ (41; 26 బంతుల్లో 6×4, 1×6) రాణించడంతో గుజరాత్ 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ డివైన్ (99; 36 బంతుల్లో 9×4, 8×6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లక్ష్యాన్ని ఆర్సీబీ 185.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్మృతి మంధాన (37; 31 బంతుల్లో 5×4 1×6) కూడా లీగ్లో తొలిసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది. టోర్నీలో రెండో విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
దంచుడే దంచుడు: పెద్ద లక్ష్యం ముందున్నా.. కొట్టి తీరాల్సిందే అని బలంగా అనుకుని దిగిందేమో సోఫీ డివైన్! గుజరాత్ బౌలర్లపై ఆమె మామూలుగా విరుచుకుపడలేదు. గుజరాత్ జట్టులో ఉత్తమ బౌలర్ అయిన ఆష్లీ గార్డ్నర్కు ఆమె ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే చుక్కలు చూపించేసింది. వరుసగా 6, 4, 4, 6, 4తో ఏకంగా ఈ ఓవర్లో 24 పరుగులు రాబట్టింది. తనూజ కన్వర్ వేసిన తొమ్మిదో ఓవర్లోనూ ఆమె ఇలాగే విరుచుకుపడింది. వరుసగా 6, 4, 6, 6 బాదేసింది. ఆ ఓవర్లో 25 పరుగులు వచ్చాయి. సోఫీ ధాటికి అంతకంటే ముందు తనూజ ఒక ఓవర్లో 18 పరుగులు సమర్పించుకుంది. పిచ్ బ్యాటింగ్కు పూర్తి అనుకూలం, పైగా చిన్న బౌండరీలు.. ఇంకేముంది బలంగా కనిపించే సోఫీకి ఎదురే లేకపోయింది. మరో ఎండ్లో ఫామ్ అందుకున్న స్మృతి కూడా ధాటిగా ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికే 77 పరుగులు చేసిన ఆర్సీబీ.. 8 ఓవర్లకే వందకు చేరుకుంది. స్మృతిని స్నేహ్ రిటర్న్ క్యాచ్తో ఔట్ చేసినా బెంగళూరుకు ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. 11వ ఓవర్లోనే డివైన్ 90ల్లోకి వచ్చేసింది. గార్త్ వేసిన 12వ ఓవర్లో 97 పరుగుల వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్ నేల పాలైంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని సోఫీ.. తర్వాతి బంతికే తొందరపాటుతో మరో షాట్ ఆడబోయి అశ్విని చేతికి చిక్కింది. దీంతో ఒక్క పరుగు తేడాలో ఆమె సంచలన శతకాన్ని కోల్పోయింది. తర్వాత ఎలీస్ పెర్రీ (19 నాటౌట్)తో కలిసి హెదర్ నైట్ (22 నాటౌట్) ధాటిగా ఆడి లాంఛనాన్ని పూర్తి చేసింది.
గుజరాత్: 188/4 (లారా 68, ఆష్లీ గార్డ్నర్ 41, సబ్బినేని మేఘన 31; సోఫీ డివైన్ 1/23);
బెంగళూరు: 189/2 (సోఫీ డివైన్ 99, స్మృతి 37; స్నేహ్ రాణా 1/25)
ప్లేఆఫ్స్కు దిల్లీ
గుజరాత్పై బెంగళూరు విజయం దిల్లీకి కలిసొచ్చింది. 6 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఇప్పటికే ముంబయి (10 పాయింట్లు) ప్లేఆఫ్స్ చేరగా.. 6 మ్యాచ్ల్లో నాలుగు నెగ్గిన దిల్లీ (8) కూడా ముందంజ వేసింది. మిగతా మూడు జట్లలో ఏదీ 8 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో దిల్లీ బెర్తు ఖరారైంది. ఇక మూడో ప్లేఆఫ్స్ బెర్తు కోసం యూపీ (6 మ్యాచ్ల్లో 6 పాయింట్లు), బెంగళూరు (7 మ్యాచ్ల్లో 4 పాయింట్లు), గుజరాత్ (7 మ్యాచ్ల్లో 4 పాయింట్లు) మధ్య పోటీ నెలకొంది. లీగ్ దశలో ప్రతి జట్టూ 8 మ్యాచ్లు ఆడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్