CSK vs SRH: సన్రైజర్స్ మార్కు ఆట.. చివరికి చెన్నైదే విజయం
పరుగుల వరద పారే ఐపీఎల్లో ఒకప్పుడు నత్తనడక బ్యాటింగ్కు పెట్టింది పేరు సన్రైజర్స్ హైదరాబాద్! కష్టపడి 130-150 మధ్య స్కోర్లు చేయడం.. ఆ లక్ష్యాల ఛేదనకు కూడా ప్రత్యర్థి జట్లు చెమటోడ్చేలా చేయడం.. సన్రైజర్స్ మ్యాచ్ల్లో చాలాసార్లు చూశాం! తర్వాత ఆట మారినా.. అప్పుడప్పుడూ పాత శైలిని బయటికి తీస్తుంటుందా జట్టు. శుక్రవారం కూడా అలాగే జరిగింది.
బ్యాటింగ్లో హైదరాబాద్ ఘోర వైఫల్యం
134/7కు పరిమితం
అయినా బంతితో పోరాటం
పరుగుల వరద పారే ఐపీఎల్లో ఒకప్పుడు నత్తనడక బ్యాటింగ్కు పెట్టింది పేరు సన్రైజర్స్ హైదరాబాద్! కష్టపడి 130-150 మధ్య స్కోర్లు చేయడం.. ఆ లక్ష్యాల ఛేదనకు కూడా ప్రత్యర్థి జట్లు చెమటోడ్చేలా చేయడం.. సన్రైజర్స్ మ్యాచ్ల్లో చాలాసార్లు చూశాం! తర్వాత ఆట మారినా.. అప్పుడప్పుడూ పాత శైలిని బయటికి తీస్తుంటుందా జట్టు. శుక్రవారం కూడా అలాగే జరిగింది. చెపాక్ స్టేడియంలో కష్టపడి 134 పరుగులు చేసిన సన్రైజర్స్.. అనంతరం బంతితో పోరాడి చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై 19వ ఓవర్ వరకు ఎదురు చూసేలా చేసింది. బ్యాటర్లు కొంచెం మెరుగ్గా ఆడి స్కోరును 150 దాటించి ఉంటే సీఎస్కేకు కష్టమయ్యేదేమో!
చెన్నై
ఐపీఎల్-16ను ఓటమితో ఆరంభించినప్పటికీ.. తర్వాత చెన్నై దూసుకెళ్తోంది. చివరి 5 మ్యాచ్ల్లో ఆ జట్టు నాలుగో విజయం సాధించింది. శుక్రవారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డెవాన్ కాన్వే (77 నాటౌట్; 57 బంతుల్లో 12×4, 1×6) సత్తా చాటడంతో 135 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్పిన్నర్ మయాంక్ మార్కండే (2/23) చక్కటి బౌలింగ్తో చెన్నైని ఇబ్బంది పెట్టాడు. అంతకుముందు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జడేజా (3/22)తో పాటు పతిరన (1/22), ఆకాశ్ సింగ్ (1/17) రాణించడంతో హైదరాబాద్ 134/7కు పరిమితమైంది. 34 పరుగులు చేసిన అభిషేక్ శర్మనే టాప్స్కోరర్. ఆరు మ్యాచ్ల్లో సన్రైజర్స్కిది నాలుగో ఓటమి.
అలవోకగా కొట్టేస్తుందనుకుంటే..: ఛేదనలో చెన్నైకి దక్కిన ఆరంభం చూస్తే.. ఆట 15 ఓవర్ల వరకైనా సాగుతుందా అనిపించింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన కాన్వే.. జాన్సన్ వేసిన ఆరో ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 4తో చెలరేగిపోయాడు. పెద్దగా కష్టపడకుండానే అతను బంతిని పదే పదే బౌండరీ దాటించాడు. రుతురాజ్ (35) కూడా నిలకడగా ఆడగా.. వికెట్ కోల్పోకుండా 6 ఓవర్లకు 60, 10 ఓవర్లకు 86 పరుగులు చేసిన చెన్నై సునాయాసంగా గెలిచేలా కనిపించింది. కానీ ఉమ్రాన్ మాలిక్ 11వ ఓవర్లో ఒక్క పరుగే ఇవ్వడం.. ఫాలో త్రూలో అతడి చేయి తాకి రుతురాజ్ రనౌటైపోవడంతో చెన్నై ఒత్తిడిలో పడింది. తర్వాతి 2 ఓవర్లలో దాగర్, సుందర్ తలో 4 పరుగులే ఇచ్చారు. 7 ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి రాగా.. రహానె (9), రాయుడు (9) ఒకరి తర్వాత ఒకరు వెనుదిరగడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. సన్రైజర్స్ అద్భుతాలేమైనా చేస్తుందా అనిపించింది. కానీ కాన్వే తిరిగి వేగం అందుకుని చకచకా బౌండరీలు బాది మ్యాచ్ను ముగించాడు.
11 ఓవర్లలో 6 వికెట్లు, 64 పరుగులు: మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 134 పరుగులు చేయడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఇన్నింగ్స్ రెండో అర్ధంలో ఆ జట్టు తీవ్రంగా తడబడింది. ఈ సీజన్ తొలి రెండు మ్యాచ్ల ప్రదర్శనను పునరావృతం చేస్తూ.. టీ20ని కాస్తా వన్డేలా మార్చేశారు ఆ జట్టు బ్యాటర్లు. నిజానికి సన్రైజర్స్కు పర్వాలేదనిపించే ఆరంభం లభించింది. వేగంగా ఆడలేకపోతున్న మయాంక్ను మిడిలార్డర్కు మార్చి, అక్కడ ఆడుతున్న అభిషేక్ శర్మ (34; 26 బంతుల్లో 3×4, 1×6)ను ఓపెనింగ్లోకి పంపగా.. అతను ఆకట్టుకున్నాడు. అభిషేక్.. బ్రూక్ (18)తో తొలి వికెట్కు 35, త్రిపాఠి (21)తో రెండో వికెట్కు 36 పరుగులు జోడించడంతో 9 ఓవర్లకు 70/1తో సన్రైజర్స్ మెరుగ్గానే కనిపించింది. కానీ తర్వాతి 11 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి కేవలం 64 పరుగులే చేయగలిగింది. చెన్నై బౌలర్లు పరుగులూ ఇవ్వలేదు. అలాగే వికెట్లూ నిలవనివ్వలేదు. ఆ జట్టులో నలుగురు బౌలర్లు 7 లోపు ఎకానమీని నమోదు చేశారు. మధ్య ఓవర్లలో జడేజా ధాటికి సన్రైజర్స్ కుదేలైంది. అతడి బౌలింగ్లో షాట్లకు ప్రయత్నించి అభిషేక్, త్రిపాఠి క్యాచౌట్ కాగా.. మయాంక్ (2) స్టంపౌటయ్యాడు. మధ్యలో కెప్టెన్ మార్క్రమ్ (12)ను తీక్షణ పెవిలియన్ చేర్చాడు. క్లాసెన్ (17), జాన్సన్ (17 నాటౌట్), సుందర్ (9) కాస్త పోరాడటంతో సన్రైజర్స్ ఆ మాత్రం స్కోరైనా చేసింది.
అహ్మదాబాద్లో ఫైనల్
దిల్లీ: ఐపీఎల్-16 ప్లేఆఫ్స్ వేదికలు ఖరారయ్యాయి. ఇంతకుముందు లీగ్ దశ షెడ్యూల్ను మాత్రమే ప్రకటించిన బీసీసీఐ శుక్రవారం మిగతా నాలుగు మ్యాచ్ల వివరాలను వెల్లడించింది. అహ్మదాబాద్లో మే 28న ఫైనల్ జరగనుంది. మే 26న క్వాలిఫయర్-2కు కూడా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్కూ ఈ మైదానమే వేదిక. గత సీజన్లో తుది పోరును కూడా ఇక్కడే నిర్వహించారు. మరోవైపు మే 23, 24 తేదీల్లో జరిగే క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు చెన్నై వేదిక కానుంది. మే 21న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్తో లీగ్ దశ ముగియనుంది.
ధోని రికార్డు
41 ఏళ్ల వయసులోనూ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో రికార్డులు తిరగరాస్తూనే ఉన్నాడు. ఈ సీఎస్కే కెప్టెన్ తాజాగా టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్కీపర్గా చరిత్ర సృష్టించాడు. సన్రైజర్స్తో మ్యాచ్లో మార్క్రమ్ క్యాచ్ అందుకున్న అతను.. మొత్తం 208 క్యాచ్లతో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. డికాక్ (207), దినేశ్ కార్తీక్ (205) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
అవే మెరుపులు
వయసు పెరిగినా తన వికెట్ కీపింగ్ నైపుణ్యాల్లో ఏ మార్పూ లేదని మహేంద్రసింగ్ ధోని మరోసారి రుజువు చేశాడు. త్వరలో 42 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న మహి.. శుక్రవారం సన్రైజర్స్తో మ్యాచ్లో చూపించిన చురుకుదనానికి ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. జడేజా బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ ముందుకొచ్చి షాట్ ఆడబోగా.. బంతి అతడి బ్యాట్కు చిక్కలేదు. రెప్పపాటులో బంతిని అందుకుని మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు ధోని. మయాంక్ తిరిగి క్రీజును చేరుకునే ప్రయత్నం కూడా చేయకుండా వెనుదిరిగాడు. మార్క్రమ్ బ్యాట్ అంచుకు తాకి వచ్చిన క్యాచ్ను స్టంప్స్కు చాలా దగ్గరగా అందుకోవడంలో, అలాగే చివరి బంతికి సుందర్ను రనౌట్ చేయడంలోనూ ధోని తన మార్కు చూపించాడు.
సన్రైజర్స్ ఇన్నింగ్స్: బ్రూక్ (సి) రుతురాజ్ (బి) ఆకాశ్ 18; అభిషేక్ (సి) రహానె (బి) జడేజా 34; త్రిపాఠి (సి) ఆకాశ్ (బి) జడేజా 21; మార్క్రమ్ (సి) ధోని (బి) తీక్షణ 12; క్లాసెన్ (సి) రుతురాజ్ (బి) పతిరన 17; మయాంక్ అగర్వాల్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 2; మార్కో జాన్సన్ నాటౌట్ 17; సుందర్ రనౌట్ 9; ఎక్స్ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 134; వికెట్ల పతనం: 1-35, 2-71, 3-84, 4-90, 5-95, 6-116, 7-134; బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3-0-17-1; తుషార్ దేశ్పాండే 3-0-26-0; తీక్షణ 4-0-27-1; మొయిన్ అలీ 2-0-18-0; జడేజా 4-0-22-3; పతిరన 4-0-22-1
చెన్నై ఇన్నింగ్స్: రుతురాజ్ రనౌట్ 35; కాన్వే నాటౌట్ 77; రహానె (సి) మార్క్రమ్ (బి) మార్కండే 9; రాయుడు (బి) మార్కండే 9; మొయిన్ అలీ నాటౌట్ 6; ఎక్స్ట్రాలు 2 మొత్తం: (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 138; వికెట్ల పతనం: 1-87, 2-110, 3-122; బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 2-0-10-0; మార్కో జాన్సన్ 3-0-37-0; మార్క్రమ్ 1-0-11-0; వాషింగ్టన్ సుందర్ 2.4-0-16-0; మయాంక్ మార్కండే 4-0-23-2; ఉమ్రాన్ మాలిక్ 3-0-18-0; మయాంక్ దాగర్ 3-0-21-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్