టీమ్‌ ఇండియా సాధన షురూ

విరాట్‌ కోహ్లి సోమవారం ట్రెయినింగ్‌ సెషన్‌లో భారత జట్టుతో చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Published : 30 May 2023 03:48 IST

అరండెల్‌ (ససెక్స్‌): విరాట్‌ కోహ్లి సోమవారం ట్రెయినింగ్‌ సెషన్‌లో భారత జట్టుతో చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘‘భారత జట్టు ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం సాధన మొదలెట్టారు’’ అని బీసీసీఐ ట్విట్టర్లో చెప్పింది. కోహ్లి, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌ల చిత్రాలను కూడా పోస్ట్‌ చేసింది. జడేజా, గిల్‌, షమి, భరత్‌, రహానెలతో కూడిన భారత జట్టు చివరి బృందం మంగళవారం ఇంగ్లాండ్‌ బయలుదేరనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని