సన్రైజర్స్ తడాఖా
వారం కిందట ఉప్పల్ స్టేడియం పరుగుల వర్షంలో తడిసి ముద్దయిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది సన్రైజర్స్ ఆ మ్యాచ్లో. ఈసారి బలమైన బ్యాటింగ్ ఉన్న చెన్నై సూపర్కింగ్స్తో మ్యాచ్ కాబట్టి మరోసారి పరుగుల పంట ఖాయమనుకున్నారంతా.
సత్తా చాటిన బౌలర్లు
మెరిసిన మార్క్రమ్, అభిషేక్
చెన్నైపై అలవోక విజయం
వారం కిందట ఉప్పల్ స్టేడియం పరుగుల వర్షంలో తడిసి ముద్దయిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది సన్రైజర్స్ ఆ మ్యాచ్లో. ఈసారి బలమైన బ్యాటింగ్ ఉన్న చెన్నై సూపర్కింగ్స్తో మ్యాచ్ కాబట్టి మరోసారి పరుగుల పంట ఖాయమనుకున్నారంతా. కానీ శుక్రవారం ఉప్పల్లో సిక్సర్ల మోత మోగలేదు. ఈసారి బంతి పదును చూపించిన ఆతిథ్య జట్టు.. చెన్నైకి చెక్ పెట్టింది. బ్యాటింగ్లో ఆశించిన స్థాయిలో మెరుపులు లేకపోవడం నిరాశ కలిగించినా.. సన్రైజర్స్ ఆట మాత్రం అభిమానులను ఆకట్టుకుంది.
ఈనాడు, హైదరాబాద్
సొంతగడ్డపై సన్రైజర్స్ సత్తాచాటింది. హైదరాబాద్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ మెరిసింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. మొదటి నుంచి చివరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన సన్రైజర్స్ ఈ సీజన్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు సాధించింది. శివమ్ దూబె (45; 24 బంతుల్లో 2×4, 4×6) మాత్రమే ఆకట్టుకున్నాడు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (37; 12 బంతుల్లో 3×4, 4×6) మెరుపు ఆరంభంతో మరో 11 బంతులు మిగిలివుండగానే సన్రైజర్స్ లక్ష్యాన్ని ఛేదించింది. 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు సాధించింది. మార్క్రమ్ (50; 36 బంతుల్లో 4×4, 1×6) అర్ధసెంచరీతో రాణించగా.. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్కుమార్రెడ్డి (14 నాటౌట్; 8 బంతుల్లో 1×4, 1×6) సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు.
అభిషేక్ తేల్చేశాడు..: చెన్నై ఇన్నింగ్స్ ఎంత కష్టంగా సాగిందో సన్రైజర్స్ బ్యాటింగ్ అంత దూకుడుగా పరుగెత్తింది. తొలి ఓవర్ నుంచే సన్రైజర్స్ టాప్ గేర్లో దూసుకెళ్లింది. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికి ఫస్ట్ స్లిప్లో ట్రావిస్ హెడ్ (31; 24 బంతుల్లో 3×4, 1×6) క్యాచ్ను మొయిన్ అలీ జారవిడవడంతోనే మ్యాచ్ చెన్నైకి ఇబ్బందులు తప్పలేదు. సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ.. మ్యాచ్ ఫలితాన్ని ముందే తేల్చేశాడు. ముకేశ్ చౌదరి రెండో ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక బౌండరీతో 27 పరుగులు రాబట్టి చెన్నైని ఆత్మరక్షణలోకి నెట్టాడు. చాహర్ ఓవర్లోనూ సిక్సర్, బౌండరీతో చెలరేగాడు. ఆ తర్వాతి బంతికే అభిషేక్ ఔటైనా అప్పటికే జరగాల్సిన నష్టం చేసేశాడు. అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఊపును కొనసాగించిన హెడ్, మార్క్రమ్ బౌండరీలతో అలరించారు. దీంతో పవర్ ప్లే ముగిసేలోపే సన్రైజర్స్ సగం లక్ష్యానికి చేరువైంది. 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు సాధించింది. 8.5 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. హెడ్ నిష్క్రమణ తర్వాత సన్రైజర్స్ దూకుడు కాస్త తగ్గింది. కానీ హెడ్, మార్క్రమ్ రెండో వికెట్కు 60 పరుగులు జోడించడంతో సురక్షిత స్థానానికి చేరుకున్న సన్రైజర్స్పై అదేమంత ప్రభావం చూపలేదు. విజయానికి చేరువలో షాబాజ్, మార్క్రమ్ ఔటైనా.. క్లాసెన్, నితీశ్కుమార్ లాంఛనాన్ని పూర్తి చేశారు.
చెన్నై కష్టంగా..: టాస్ గెలిచి సన్రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. చెన్నై బ్యాటర్ల నుంచి మెరుపులు ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అభిషేక్ శర్మ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్లు రచిన్ రవీంద్ర (12; 9 బంతుల్లో 2×4), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26; 21 బంతుల్లో 3×4, 1×6) కష్టాలు కనిపించాయి. పిచ్ నెమ్మదిగా ఉండటం.. బంతి బ్యాటు మీదకి రాకపోవడంతో మొదటి ఓవర్లో 7 పరుగులే వచ్చాయి. అప్పుడప్పుడు మెరుపులు తప్పితే మ్యాచ్ ఆద్యంతం అలాగే సాగింది. సన్రైజర్స్ నుంచి ఏడుగురు బౌలర్లు అస్త్రాలు ఎక్కుపెట్టడంతో చెన్నై బ్యాటర్లు గుక్కతిప్పుకోలేకపోయారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో ఒత్తిడి పెంచడంతో రచిన్ రవీంద్ర భారీ షాట్కు ప్రయత్నించి నిష్క్రమించాడు. పవర్ ప్లేలో చెన్నై ప్రదర్శన (48/1) సాధారణంగా కనిపించింది. ఆ తర్వాత కూడా గైక్వాడ్, ఆజింక్య రహానె (35; 30 బంతుల్లో 2×4, 1×6) ఇన్నింగ్స్లో జోరు పెంచడంలో విఫలమయ్యారు. బంతి మిడిల్ కాకపోవడంతో భారీ షాట్లు ఆడలేకపోయారు. ఒత్తిడి పెరిగిపోవడంతో గైక్వాడ్ కూడా భారీ షాట్ ఆడబోయి వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులోకొచ్చిన శివమ్ దూబె మైదానంలో, చెన్నై శిబిరంలో జోష్ తీసుకొచ్చాడు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. దూబె.. భువనేశ్వర్ బౌలింగ్లో ఔటవగా.. అప్పటికి స్కోరు 13.4 ఓవర్లలో 119/3. దూబె తర్వాత చెన్నై ఇన్నింగ్స్ చప్పగా సాగింది. వన్డే మ్యాచ్ తరహాలో ఆడిన రహానె.. చివరికి ఉనద్కత్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆపై రవీంద్ర జడేజా (31 నాటౌట్; 23 బంతుల్లో 4×4) కొంచెం దూకుడుగా ఆడగా మిచెల్ (13; 11 బంతుల్లో 1×4) తీవ్రంగా తడబడ్డాడు. ఆఖరి అయిదు ఓవర్లలో చెన్నై 38 పరుగులు మాత్రమే చేసింది.
చెన్నై ఇన్నింగ్స్: రచిన్ (సి) మార్క్రమ్ (బి) భువనేశ్వర్ 12; రుతురాజ్ (సి) సమద్ (బి) షాబాజ్ 26; రహానె (సి) మార్కండే (బి) ఉనద్కత్ 35; దూబె (సి) భువనేశ్వర్ (బి) కమిన్స్ 45; జడేజా నాటౌట్ 31; డరైల్ మిచెల్ (సి) సమద్ (బి) నటరాజన్ 13; ధోని నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 2; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 165; వికెట్ల పతనం: 1-25, 2-54, 3-119, 4-127, 5-160; బౌలింగ్: అభిషేక్శర్మ 1-0-7-0; భువనేశ్వర్ 4-0-28-1; నటరాజన్ 4-0-39-1; కమిన్స్ 4-0-29-1; మయాంక్ మార్కండే 2-0-21-0; షాబాజ్ అహ్మద్ 1-0-11-1; ఉనద్కత్ 4-0-29-1
హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) రచిన్ (బి) తీక్షణ 31; అభిషేక్ శర్మ (సి) జడేజా (బి) దీపక్ చాహర్ 37; మార్క్రమ్ ఎల్బీ (బి) అలీ 50; షాబాజ్ అహ్మద్ ఎల్బీ (బి) అలీ 18; క్లాసెన్ నాటౌట్ 10; నితీష్ కుమార్ రెడ్డి నాటౌట్ 14; ఎక్స్ట్రాలు 6 మొత్తం: (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 166; వికెట్ల పతనం: 1-46, 2-106, 3-132, 4-141; బౌలింగ్: దీపక్ చాహర్ 3.1-0-32-1; ముకేశ్ చౌదరి 1-0-27-0; తీక్షణ 4-0-27-1; తుషార్ 2-0-20-0; జడేజా 4-0-30-0; మొయిన్ అలీ 3-0-23-2; రచిన్ 1-0-3-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాతో కెప్టెన్ రోహిత్ శర్మ సరదా సంభాషణ నెట్టింట వైరల్గా మారింది. లఖ్నవూ - ముంబయి మ్యాచ్ సందర్భంగా వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. -
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా ట్రోల్ చేయడంపై భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదేవిధంగా లఖ్నవూతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్కు రూ.24 లక్షలు జరిమానా పడింది. -
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్