IND vs NZ: ‘‘అతడిని చూస్తూ ఉండండి.. మున్ముందు మాయ చేస్తాడు’’
ఇటీవల ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ పేరు మార్మోగింది. ఎందుకంటే.. ఈ మెగా లీగ్లో అతడు అత్యధిక పరుగులు (635) చేసిన ఆటగాడిగా నిలిచి.. సీఎస్కే నాలుగోసారి ఛాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ పేరు మార్మోగింది. ఎందుకంటే.. ఈ మెగా లీగ్లో అతడు అత్యధిక పరుగులు (635) చేసిన ఆటగాడిగా నిలిచి.. సీఎస్కే నాలుగోసారి ఛాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని సెలెక్టర్లు అతడిని న్యూజిలాండ్తో జరిగే మూడు టీ20 మ్యాచ్ల సిరీస్కి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే రుతురాజ్ గైక్వాడ్పై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్లో గైక్వాడ్ ఆడుతుంటే చూడాలని ఉందన్నాడు. ఐపీఎల్లో తాను చూసిన మంచి ఇన్నింగ్స్ల్లో గైక్వాడ్ ఆడినవి కొన్ని ఉన్నాయని స్వాన్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో రుతురాజ్ మంచి ఆటగాడిగా మారబోతున్నాడని మైక్ హస్సీ కొన్నేళ్ల కిందటే తనతో చెప్పాడని గ్రేమ్ స్వాన్ వెల్లడించాడు.
"చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ ప్రత్యేకమైనవాడు. ఐపీఎల్లో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ల్లో అతడు ఆడినవి కొన్ని ఉన్నాయి. అబుదాబిలో గైక్వాడ్ సెంచరీ చేయడం సంచలనం. న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్కు అతడు ఎంపికైనందుకు సంతోషిస్తున్నా. రుతురాజ్ గైక్వాడ్ ఒక సంపూర్ణమైన ఆటగాడిగా మారబోతున్నాడని మైక్ హస్సీ నాతో కొన్నేళ్ల క్రితం చెప్పాడు. అతడిని చూస్తూ ఉండండి.. మున్ముందు మాయ చేస్తాడు. గైక్వాడ్ 10 మార్కులకుగాను 9 మార్కులు సాధించాడు. ఇంకా రాటుదేలుతున్నాడు’’ అని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ వివరించాడు.
ఇప్పటివరకు తన కెరీర్లో నిలకడగా ఫామ్లో లేని శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు తానెంటో నిరూపించుకోవాల్సి ఉందని స్వాన్ అన్నాడు. ‘‘శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తుంటే చూడటం అద్భుతంగా ఉంటుంది. కానీ, అతడు నిలకడగా మంచి ప్రదర్శనలు చేయలేదు. కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్లు ఉన్నా.. మరికొన్ని బలహీనమైన ప్రదర్శనలూ ఉన్నాయి. నేనైతే శ్రేయస్ ఆటకు ఎనిమిది మార్కులు వేస్తా. కానీ, అతడు సులభంగా 10 మార్కులు అందుకోగలడు’ అని గ్రేమ్ స్వాన్ ముగించాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం