ICC: లాహోర్లో ఐసీసీ ఛైర్మన్.. ప్రపంచకప్లో పాక్ ఆడే అంశం ఓ కొలిక్కి వచ్చేనా..?
భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ కోసం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తుంటారు. అయితే, రెండు మెగా టోర్నీల భవిత మాత్రం ఏంటా అని ఆందోళన మొదలైంది. దీంతో ఐసీసీ పెద్దలు రంగంలోకి దిగారు.
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ - పీసీబీ (BCCI-PCB) మధ్య ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ పీటముడి ఇంకా కొనసాగుతోంది. తమ దేశంలో జరిగే ఆసియా కప్లో ఆడకపోతే.. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో పాక్ పాల్గొనేది లేదని పీసీబీ (PCB) ఛైర్మన్ నజామ్ సేథి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలా కాకుండా తమ మ్యాచ్లను భారత్లో (Team India) కాకుండా ఇతర దేశాల్లో నిర్వహిస్తే తప్పకుండా పాల్గొంటామని నజామ్ ఓ ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రెండు మెగా టోర్నీల పరిస్థితి ఎలా ఉంటుందోనని క్రికెట్ అభిమానుల్లో సందేహం నెలకొంది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే, సీఈవో జెఫ్ అలార్డిక్ రంగలోకి దిగారు. ఎలాంటి కండీషన్ లేకుండా ప్రపంచకప్లో పాల్గొనేలా పాక్ను ఒప్పించేందుకు ఇప్పటికే లాహోర్కు చేరుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
భద్రతా కారణాలరీత్యా ప్రభుత్వం అనుమతి ఇవ్వనిపక్షంలో.. తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా ఐసీసీని అడుగుతామని నజామ్ తెలిపారు. ఈ క్రమంలో ఐసీసీ వర్గాలు మాత్రం విభిన్నంగా స్పందించాయి. ‘‘ఐసీసీ, బీసీసీఐ మాత్రం ఇలాంటి ప్రతిపాదలనలను అంగీకరించవు. అయితే, భారత్లో పాకిస్థాన్ ఆడితే టోర్నీ మొత్తం విజయవంతమవుతుంది. అందుకే, పాక్ నుంచి సరైన హామీ తీసుకోవడానికి ఐసీసీ అత్యున్నత కార్యవర్గం నడుం బిగించింది’’ అని పేర్కొన్నాయి. బీసీసీఐ, పీసీబీ మధ్య వారధిగా ఉండేందుకు ఐసీసీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం