భారత్ చిరస్మరణీయ విజయం..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది...
బ్రిస్బేన్: టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో రిషభ్ పంత్ (89నాటౌట్; 138 బంతుల్లో 9x4, 1x6), వాషింగ్టన్ సుందర్(22) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించారు.
ఆదిలో నెమ్మదిగా ఆడినా..
4/0 ఓవర్నైట్ స్కోర్తో మంగళవారం ఐదోరోజు ఆట కొనసాగించిన టీమ్ఇండియా ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ(7) వికెట్ కోల్పోయింది. అనంతరం శుభ్మన్ గిల్ (91;146 బంతుల్లో 8x4,2x6), పుజారా(56; 211 బంతుల్లో 7x4) జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను పూర్తి చేశారు. అప్పటికి టీమ్ఇండియా స్కోర్ 83/1గా నమోదైంది. భోజన విరామం తర్వాత ధాటిగా ఆడిన గిల్ శతకానికి చేరవలో ఉండగా లైయన్ బౌలింగ్లో స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో 114 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే కెప్టెన్ అజింక్య రహానె(24) పెవిలియన్ చేరాడు. కమిన్స్ బౌలింగ్లో పైన్కు క్యాచ్ ఇచ్చాడు. ఆపై రెండో సెషన్ పూర్తయ్యే సమయానికి భారత్ 183/3తో నిలిచింది.
పంత్, సుందర్ మెరుపు బ్యాటింగ్..
ఇక మూడో సెషన్లో టీమ్ఇండియా విజయానికి 144 పరుగులు చేయాల్సి ఉండడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అంతా అనుకున్నారు. పుజారా, పంత్ ఆ విధంగానే ఆడారు. వారిద్దరూ వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే, జట్టు స్కోర్ 228 పరుగుల వద్ద పుజారా నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. కాసేపటికే మయాంక్ అగర్వాల్ (9) స్వల్ప స్కోరుకు పెవిలియన్ చేరాడు. అప్పటికి టీమ్ఇండియా 265/5 స్కోర్తో నిలిచింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలోనే భారత్ విజయానికి 62 పరుగులు అవసరమైన వేళ పంత్తో జోడీకట్టిన వాషింగ్టన్ సుందర్(22; 29 బంతుల్లో 2x4,1x6) ధాటిగా ఆడాడు. పంత్ సైతం బౌండరీలు బాదడంతో టీమ్ఇండియా విజయానికి చేరువైంది. ఈ క్రమంలోనే సుందర్, శార్దూల్ ఠాకూర్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అప్పటికే భారత్ గెలుపు ఖాయమైంది. హేజిల్వుడ్ వేసిన 97వ ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టిన పంత్ భారత్కు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. దీంతో పంత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 369 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 336 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 294 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ : 329/7
ఇవీ చదవండి..
అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు..
ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం