IND vs AUS: గిల్ సెంచరీ.. కోహ్లీ హాఫ్ సెంచరీ.. మూడో రోజు ఆట పూర్తి
భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది.
అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (59; 128 బంతుల్లో 5 ఫోర్లు బ్యాటింగ్), రవీంద్ర జడేజా (16; 54 బంతుల్లో 1 సిక్స్ బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 191 పరుగుల వెనుకంజలో ఉంది. శుభ్మన్ గిల్ (128; 235 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) శతకం బాదగా.. ఛెతేశ్వర్ పుజారా (42; 121 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్, మాథ్యూ కునెమన్, టాడ్ మార్ఫీ తలో వికెట్ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ 480 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఓవర్ నైట్ స్కోరు 36/0తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా కాసేపు నిలకడగానే ఆడింది. ఓ గంట తర్వాత భారత్కు షాక్ తగిలింది. రోహిత్ శర్మ (35).. కునెమన్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు యత్నించి షార్ట్ కవర్ పాయింట్లోని లబుషేన్ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి గిల్ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ క్రమంలో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది. రెండో సెషన్ ప్రారంభంలో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో భారత్ బ్యాటర్లు నిదానంగా ఆడారు. తర్వాత కాస్త దూకుడు పెంచారు. టీ విరామానికి ముందు గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటికే పుజారా ఔటయ్యాడు. అతడు మర్ఫీ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండో సెషన్లో భారత్ 59 పరుగులు మాత్రమే రాబట్టి రెండు వికెట్లను కోల్పోయింది.
మూడో సెషన్లో కోహ్లీ దూకుడు
188/2తో చివరి సెషన్ను ఆరంభించింది భారత్. ఈ సెషన్లో మొదట్లో నెమ్మదిగా ఆడిన కోహ్లీ తర్వాత బ్యాట్ను ఝుళిపించాడు. స్టార్క్, మర్ఫీ వేసిన వరుస ఓవర్లలో బౌండరీలు బాదాడు. కొద్దిసేపటికే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన గిల్.. లైయన్ బౌలింగ్లో ఎల్బీగా ఔటయ్యాడు. డీఆర్ఎస్కు వెళ్లినా.. సమీక్షలోనూ ఔట్గా తేలడంతో పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా నిదానంగా ఆడగా.. కోహ్లీ నిలకడగా పరుగులు రాబట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కోహ్లీకిది టెస్టుల్లో గత 16 ఇన్నింగ్స్ల్లో మొదటి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.