Indw vs Ausw: తొలి టీ20లో భారత్పై ఆసీస్ ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20లో ఆసీస్ అదరగొట్టింది. టీమ్ఇండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యం సంపాదించింది.
ముంబయి: మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20లో ఆసీస్ అదరగొట్టింది. టీమ్ఇండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ (89; 57 బంతుల్లో 16 ఫోర్లు) విజయంలో కీలకపాత్ర పోషించింది. అలిస్సా హీలీ (37; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించగా.. తహ్లియా మెక్గ్రాత్ (40) ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో దేవిక వైద్య ఒక వికెట్ పడగొట్టగా మిగతా బౌలర్లు ఒక్క వికెట్టూ కూడా పడగొట్టలేకపోయారు.
ఓపెనర్లు తొలి మూడు ఓవర్లపాటు నెమ్మదిగా ఆడినా తర్వాత నుంచి జోరు పెంచారు. దీంతో 8 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 68/0గా నమోదైంది. ఈ జోడీ దూకుడుకు తొమ్మిదో ఓవర్లో దేవిక వైద్య బ్రేక్లు వేసింది. అలిస్సాని ఔట్ చేసి భారత్కు ఉపశమనాన్ని అందించింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెక్గ్రాత్తో కలిసి బెత్ మూనీ ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లి ఆసీస్కు విజయాన్ని అందించింది.
భారత్ ఇన్నింగ్స్లో దీప్తి శర్మ (36;15 బంతుల్లో 8 ఫోర్లు), రీచా ఘోష్ (36; 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ఓపెనర్ షెఫాలీ వర్మ (21; 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడగా.. స్మృతి మంధాన (28; 22 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. జెమీమా రోడ్రిగ్స్ (0) నిరాశపర్చగా.. హర్మన్ ప్రీత్ కౌర్ (21), దేవికా వైద్య (24) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లీస్ పెర్రీ రెండు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.