IPL 2022: ఈసారి కప్పు సాధించే సత్తా మాకుంది: హెట్మైయిర్
ఈసారి కప్పు సాధించే సత్తా రాజస్థాన్ రాయల్స్కు ఉందని ఆ జట్టులో కొత్తగా చేరిన బిగ్ హిట్టర్ షిమ్రన్ హెట్మైయిర్ ధీమా వ్యక్తం చేశాడు. ఇంతకముందు బెంగళూరు, దిల్లీ ఫ్రాంఛైజీల జట్లతో...
(Photo: Rajasthan Royals Twitter)
ఇంటర్నెట్డెస్క్: ఈసారి కప్పు సాధించే సత్తా రాజస్థాన్ రాయల్స్కు ఉందని ఆ జట్టులో కొత్తగా చేరిన బిగ్ హిట్టర్ హెట్మైయిర్ ధీమా వ్యక్తం చేశాడు. ఇంతకు ముందు బెంగళూరు, దిల్లీ ఫ్రాంఛైజీల జట్లతో ఆడిన అతడు ఈసారి మెగా వేలంలో రాజస్థాన్కు మారిపోయాడు.
‘రాజస్థాన్ జట్టులో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఫ్రాంఛైజీ గురించి నా మిత్రుడు ఎవిన్ చాలా మంచి విషయాలు చెప్పాడు. ఐపీఎల్లో నేను తొలిసారి బెంగళూరు తరఫున ఆడాను. అదెంతో సవాలుతో కూడుకున్నదిగా అనిపించింది. అప్పుడు ఆ జట్టులో నేను ఒక్కడినే వెస్టిండీస్ నుంచి వచ్చాను. దీంతో అక్కడ సర్దుకుపోయేందుకు కాస్త ఇబ్బందిపడ్డా. అయితే, మొత్తంగా ఐపీఎల్ వల్ల చాలా మంచి విషయాలు నేర్చుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా ఎలా ఆడాలి, ఆటతీరు ఎలా మెరుగుపరుచుకోవాలన్న విషయాలు తెలుసుకున్నా’ అని హెట్మైయిర్ పేర్కొన్నాడు.
ఇక ఈ ఏడాది కొత్త ఆటగాళ్లతో నిండిన రాజస్థాన్ జట్టుపై స్పందించిన అతడు కుమార సంగక్కర నేతృత్వంలో రాణించడానికి సిద్ధంగా ఉన్నామన్నాడు. ‘సంగక్కర లాంటి దిగ్గజ ఆటగాడి పర్యవేక్షణలో ఆడటం గొప్ప విషయం. అతడితో మాట్లాడి నా ఆటలో అవసరమైన మార్పులు చేసుకుంటా. దీంతో కేవలం పరిమిత ఓవర్లలోనే కాకుండా సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లోనూ రాణించాలనుకుంటున్నా. ఇక ఇప్పుడున్న రాజస్థాన్ జట్టుతో నేను సంతోషంగా ఉన్నా. మాకున్న ఆటగాళ్లతో ఈ ఏడాది తిరిగి కప్పు సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని హెట్మైయిర్ పేర్కొన్నాడు. కాగా, రాజస్థాన్ ఐపీఎల్ ఆరంభ సీజన్లోనే విజేతగా నిలిచింది. తర్వాత మరోసారి టైటిల్ గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలోనే హెట్మైయిర్ ఈసారి కప్పు కొడతామనే ధీమాతో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం