Najam Sethi: IPL కంటే PSLను ఎక్కువ మంది చూశారంటా.. విషం కక్కిన నజామ్ సేథీ
ఐపీఎల్ (IPL) పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజామ్ సేథీ (Najam Sethi) తన అక్కసును వెళ్లగక్కాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఎనిమిదో సీజన్ శనివారం ముగిసింది. ఉత్కంఠభరితంగా టైటిల్ పోరులో ముల్తాన్ సుల్తాన్స్ని లాహోర్ ఖలందర్స్ ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడించి ఛాంపియన్గా అవతరించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 20 ఓవర్లలో 200/6 భారీ స్కోరును నమోదు చేసింది. అబ్దుల్లా షఫీక్ (65; 40 బంతుల్లో), షాహీన్ (*44; 15 బంతుల్లో) దూకుడుగా ఆడారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సుల్తాన్స్ 199/8కి పరిమితమయ్యారు. పీఎస్ఎల్ ముగియగా.. క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో లీగ్ సిద్ధమవుతోంది. మార్చి 31 నుంచి ఐపీఎల్-16 (IPL 16) సీజన్ ప్రారంభంకానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఐపీఎల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ నజామ్ సేథీ (Najam Sethi) తన అక్కసును వెళ్లగక్కాడు. డిజిటల్ విధానంలో ఐపీఎల్ కంటే పీఎస్ఎల్కు ఎక్కువ ఆదరణ ఉందని వ్యాఖ్యానించాడు.
‘డిజిటల్ గురించి మాట్లాడుకుంటే.. పీఎస్ఎల్ (PSL)సగం సీజన్ ముగిసిన తర్వాత నేను మా డిజిటల్ రేటింగ్ గురించి అడిగాను. టీవీలో 0.5 రేటింగ్ ఉండగా.. డిజిటల్ రేటింగ్ 11 కంటే ఎక్కువ ఉంది. లీగ్ ముగిసే సమయానికి అది 18 నుంచి 20కి చేరుతుంది. పీఎస్ఎల్ని 15 కోట్లమందికిపైగా ప్రజలు డిజిటల్ విధానంలో చూశారు. ఇది చిన్న విషయం కాదు. అదే దశలో ఐపీఎల్ (IPL) డిజిటల్ రేటింగ్ (130 మిలియన్లు) 13 కోట్లు. పీఎస్ఎల్ డిజిటల్ రేటింగ్ 150 మిలియన్లకు పైగా ఉంది. కాబట్టి ఇది పాకిస్థాన్కు గొప్ప విజయం’ అని నజామ్ సేథీ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.