Ishan Kishan: జోరు కొనసాగిస్తున్న ఇషాన్ కిషన్.. రంజీ ట్రోఫీలో సెంచరీ
ఇటీల బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (210) డబుల్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. అదే జోరును రంజీ టోఫ్రీలో కొనసాగిస్తున్నాడు. కేరళతో జరిగిన మ్యాచ్లో అతడు సెంచరీ (132) బాదాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (210) బాదిన సంగతి తెలిసిందే. కేవలం 126 బంతుల్లోనే ద్విశతకం సాధించాడు. వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ ఇదే. ఇప్పటి వరకు క్రిస్ గేల్ (138 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. వన్డేల్లో సెంచరీ చేయకుండా డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్గానూ రికార్డు సృష్టించాడు. ఇషాన్ ద్వి శతకం సాధించి వారం కూడా కావట్లేదు. ఇంతలోనే రంజీ ట్రోఫీలో శతకం బాదేశాడు. ఝార్ఖండ్ , కేరళ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ (132; 195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీలో తన ఆరో శతకాన్ని నమోదు చేశాడు ఝార్ఖండ్ డైనమెట్.
ఈ మ్యాచ్లో ఇషాన్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. అప్పటికి ఝార్ఖండ్ 114/4 స్కోరుతో కష్టాల్లో ఉంది. సౌరభ్ తివారీ (97)తో జట్టు కట్టి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. వీరిద్దరూ కేరళ బౌలర్లను దీటుగా ఎదుర్కొని ఐదో వికెట్కు 200కు పైచిలుకు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మొదటి ఇన్నింగ్స్లో ఝార్ఖండ్
340 పరుగులకు ఆలౌటైంది. నాలుగు రోజుల ఈ మ్యాచ్లో మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో కేరళ ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.