Virat-Anushka : ‘‘నాలుగు నిమిషాలు అనుకొని వెళ్తే నాలుగు గంటలపాటు ముచ్చటించాం’’
యువ క్రికెటర్లకు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో...
ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్న టీమ్ఇండియా మహిళా క్రికెటర్
ఇంటర్నెట్ డెస్క్ : యువ క్రికెటర్లకు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. కోహ్లీతో ఓ నాలుగు నిమిషాలు ముచ్చటించే అవకాశం వస్తే చాలు అనుకునే యువ క్రీడాకారుల సంఖ్యకు లెక్కేలేదు. అలాంటి అరుదైన ఛాన్స్ టీమ్ఇండియా మహిళా క్రికెటర్లు జెమ్మీ రోడ్రిగ్స్, స్మృతీ మంధానకు దక్కింది. అయితే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జోడీతో కొద్దిసేపు మాట్లాడదామని వెళ్లిన ఈ మహిళా క్రికెటర్లు దాదాపు నాలుగు గంటలపాటు ముచ్చటించారు. కోహ్లీ వందో టెస్టు ఆడనున్న నేపథ్యంలో ఆనాటి సంగతులను రోడ్రిగ్స్ గుర్తు చేసుకుంది.
2020లో న్యూజిలాండ్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమ్ఇండియా అక్కడ పర్యటించింది. అదే సమయంలో మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ పోటీలు జరిగాయి. ఫైనల్కు చేరిన మహిళల భారత జట్టు ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. అయితే మన ఉమెన్స్ టీమ్ ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బస చేసిన హోటల్లోనే భారత మహిళా క్రికెటర్లకు గదులను కేటాయించారు. దీంతో విరాట్తో మాట్లాడాలని అనుకున్నామని రోడ్రిగ్స్ తెలిపింది. ‘‘విరాట్ భయ్యా.. బ్యాటింగ్కు సంబంధించిన విషయాలను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాం. మేం కూడా మీరుంటున్న హోటల్లో ఉన్నాం. మిమ్మల్ని కలవొచ్చా?’’ అని కోహ్లీని రిక్వెస్ట్ చేశామని గుర్తు చేసుకున్నారు. ఎంతో సాదరంగా తమను ఆహ్వానించారని, హోటల్లోని కేఫ్కు అనుష్కతో సహా వచ్చారని రోడ్రిగ్స్ వెల్లడించింది.
ఒత్తిడిని ఎదుర్కోవడం ఎలాగంటే?
ఓ నాలుగైదు నిమిషాలు మాట్లాడదామని వెళ్లి దాదాపు నాలుగు గంటలపాటు కోహ్లీ-అనుష్కతో ముచ్చటించామని రోడ్రిగ్స్ తెలిపింది. ‘‘కాసేపు సమయం అడిగాం. అయితే చివరికి నాలుగు గంటలపాటు మాట్లాడేశాం. అందులో అరగంట సమయం బ్యాటింగ్కు సంబంధించిన అంశాల గురించి చర్చించాం. ఇక మిగతా సమయమంతా సాధారణ విషయాలే’’ అని పేర్కొంది. అభిమానుల అంచనాలను అందుకోవడానికి పడే ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కొంటారని కోహ్లీ దగ్గర తెలుసుకున్నామంది. ‘‘మైదానంలోకి దిగితే వాటన్నింటినీ పట్టించుకోను. ఆటమీదే దృష్టిసారిస్తా. బ్యాటింగ్కు దిగితే స్కోరు బోర్డు వైపు చూస్తా. అంతే కానీ ప్రేక్షకుల అరుపులపై దృష్టిపెట్టను. భారత విజయానికి నేనేం చేయగలనో దానినే ఆలోచిస్తా. మన మీద అంచనాలకు ప్రాముఖ్యత ఇవ్వడం ఆపేసి చూస్తే ఫలితాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి’’ అని విరాట్ వివరించారని రోడ్రిగ్స్ తెలిపింది. ప్రస్తుతం టీమ్ఇండియా మహిళా జట్టు వన్డే ప్రపంచకప్ కోసం కివీస్లోనే ఉంది. అయితే రోడ్రిగ్స్కు జట్టులో స్థానం దక్కలేదు. మార్చి 6న మొదటి మ్యాచ్లో పాక్తో భారత్ తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం