IND vs SA : నా కెరీర్లో భారత్దేఅత్యుత్తమ బౌలింగ్ : పీటర్సన్
తన కెరీర్లోనే అత్యంత సవాళ్లతో ఎదుర్కొన్న బౌలింగ్ ఎటాక్ టీమ్ఇండియా పేస్ యూనిట్ దేనని దక్షిణాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్ అన్నాడు...
(Photo: Cricket South Africa Twitter)
కేప్టౌన్: తన కెరీర్లోనే అత్యంత సవాళ్లతో ఎదుర్కొన్న బౌలింగ్ ఎటాక్ టీమ్ఇండియా పేస్ యూనిట్ దేనని దక్షిణాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్ అన్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో పీటర్సన్ (72) సఫారీ జట్టు తరఫున అత్యధిక స్కోర్ సాధించిన బ్యాట్స్మన్గా నిలిచాడు. రెండో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ భారత పేస్ దళంపై ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు పేస్ బౌలింగ్ శక్తి సామర్థ్యాలతో తాము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు.
‘వాళ్ల పేస్ బౌలింగ్ నాకు సవాలుగా మారింది. నా కెరీర్లో ఎదుర్కొన్న వాటిలో ఇదే మేటి బౌలింగ్ యూనిట్ అని చెప్పొచ్చు. మన ఆటపై పూర్తిగా దృష్టి సారించాలి. లేకపోతే వాళ్లు అస్సలు వదలరు. పరుగుల పరంగా కూడా టీమ్ఇండియా పేసర్లు ప్రత్యర్థి బ్యాట్స్మన్ సహనాన్ని పరీక్షిస్తారు. ఈ పిచ్పై పరుగులు చేసే అవకాశాలు పెద్దగా లేవు. వాళ్లు ప్రపంచంలోనే అత్యంత మేటి బౌలింగ్ యూనిట్లలో ఒకరు. ఈ సిరీస్కు రాకముందే భారత పేసర్లు సవాళ్లు విసురుతారని తెలుసు. దాంతో పోరాడాల్సిందేనని నిర్ణయించుకున్నాం’ అని పీటర్సన్ వివరించాడు.
అనంతరం తన బ్యాటింగ్ స్థానంపై మాట్లాడిన పీటర్సన్.. తన కెరీర్లో అత్యధిక శాతం మూడో నంబర్ ఆటగాడిగా బ్యాటింగ్ చేసినట్లు గుర్తుచేసుకున్నాడు. అలాగే తమ ఓపెనర్లు విఫలమవ్వడం పై స్పందిస్తూ.. మార్క్రమ్, ఎల్గర్ నాణ్యమైన ఆటగాళ్లని, ప్రస్తుతం సంధి దశ ఎదుర్కొంటున్నారని చెప్పాడు. వాళ్లు తిరిగి రాణిస్తారనే నమ్మకం ఉందన్నాడు. ఇప్పుడు తాను నాలుగో నంబర్ ఆటగాడిగా రావడంపై దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నాడు. అయితే, మూడో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగితే సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు