kidambi srikanth: వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కిదాంబి ఓటమి.. రజతంతో సరి
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ తుది పోరులో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్...
ఇంటర్నెట్ డెస్క్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ తుది పోరులో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ పోరాడి ఓడాడు. ఫైనల్లో సింగపూర్ ఆటగాడు కీన్యూ 21-15, 22-20 తేడాతో శ్రీకాంత్పై విజయం సాధించాడు. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టిద్దామని భావించిన కిదాంబి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఫైనల్ మ్యాచ్ తొలి సెట్ నుంచి విజయం కోసం ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మొదటి సెట్ను కీన్యూ 21-15తో సొంతం చేసుకున్నాడు. ఓటమికి డీలా పడకుండా రెండో సెట్లో కిదాంబి అద్భుతంగా పోరాడాడు. ఒక దశలో ఇద్దరి స్కోరు 20-20కి చేరుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే కిదాంబి శ్రీకాంత్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కీన్యూ వరుసగా రెండు పాయింట్లు సాధించి 22-20 తేడాతో గెలుపొందాడు. స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు.
డబ్ల్యూబీసీలో ఫైనల్కు చేరిన మూడో భారత షట్లర్గా శ్రీకాంత్ నిలిచాడు. గతంలో సైనా నెహ్వాల్ (2015), పీవీ సింధు (2017, 2018, 2019) ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. పీవీ సింధు 2019లో స్వర్ణం సాధించగా.. మిగతా రెండు సార్లు రజతాలను తన ఖాతాలో వేసుకుంది. అలానే సైనా కూడా రజతంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండు పతకాలు వచ్చాయి. కిదాంబి శ్రీకాంత్కు రజతం, సెమీస్లో ఓడిపోయిన లక్ష్య సేన్కు కాంస్య పతకాలు దక్కాయి.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.