కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన కోహ్లీ, హార్దిక్‌?

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్‌ సారథి విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్‌ సంఘం నిబంధనల ప్రకారం సిరీస్‌ ముగిసే వరకు ఆటగాళ్లు బయటకు వెళ్లకూడదు. అయితే గత డిసెంబర్‌ 7న కోహ్లీ, హార్దిక్‌ సిడ్నీలోని బేబీ షాప్‌లో ముఖానికి మాస్కులు ధరించకుండా దిగిన...

Published : 04 Jan 2021 01:16 IST

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్‌ సారథి విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్‌ 7న కోహ్లీ, హార్దిక్‌ సిడ్నీలోని బేబీ షాప్‌లో ముఖానికి మాస్కులు ధరించకుండా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలను ఆ హోటల్‌ యాజమాన్యమే పోస్టు చేయడం విశేషం.

‘‘ఇవాళ మా స్టోర్‌కు ప్రత్యేకమైన అతిథులు వచ్చారు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీషాప్‌ పోస్టు చేసింది. తాజాగా ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.  రోహిత్‌ శర్మ సహా ఐదుగురు ఆటగాళ్లు కూడా కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ శనివారం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా అంశం చర్చనీయాంశమవుతోంది.

ఇదీ చదవండి

గంగూలీ ఆరోగ్యంపై మరో బులిటెన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని