IPL 2021: ఫైనల్లో రసెల్ ఎందుకు ఆడలేదంటే..?
చెన్నై సూపర్ కింగ్స్తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రసెల్ను ఎందుకు పక్కన పెట్టారో ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ వెల్లడించాడు. గాయం కారణంగానే అతడు..
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రసెల్ను ఎందుకు పక్కన పెట్టారో ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ వెల్లడించాడు. గాయం కారణంగానే అతడు ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయాడని తెలిపాడు. ‘ఐపీఎల్ మలి దశ ఆరంభంలో గాయపడ్డ రసెల్.. ఆ గాయం నుంచి కోలుకునేందుకు చాలా శ్రమించాడు. అయితే, పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించకుండా అతడితో ఆడించి రిస్క్ చేయడం సరికాదనిపించింది. అందుకే అతడిని ఫైనల్ మ్యాచ్కి దూరం పెట్టాల్సి వచ్చింది’ అని మెక్ కల్లమ్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కోల్కతా జట్టు ఓటమిపై మెక్ కల్లమ్ స్పందించాడు. ‘మా బౌలర్లు చెన్నై జట్టు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగారు. ఫీల్డింగ్ కూడా బాగానే ఉంది. మా ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. దురదృష్టవశాత్తూ మిడిలార్డర్ కుప్పకూలడంతో మ్యాచ్పై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. మిడిలార్డర్లో ఎంతో అనుభవమున్న ఆటగాళ్లున్నా.. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అద్భుత ఫామ్లో ఉన్న రాహుల్ త్రిపాఠి గాయపడటం కూడా మాకు చేటు చేసింది. అయినా మా ఆటగాళ్లు పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది. అసలు ఆశలే లేని స్థితి నుంచి లక్ష్యం అంచువరకు రాగలిగాం’ అని మెక్ కల్లమ్ పేర్కొన్నాడు.
కరోనా కారణంగా ఐపీఎల్ అర్ధాంతరంగా రద్దయ్యే సమయానికి కోల్కతా జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే, మలి దశలో గొప్పగా పుంజుకుని వరుస విజయాలతో ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. కేకేఆర్ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన వెంకటేశ్ అయ్యర్పై మెక్ కల్లమ్ ప్రశంసలు కురిపించాడు. అతడు గొప్ప ఆటగాడని ప్రశంసించాడు. ఈ సీజన్లో 10 మ్యాచులు ఆడిన అయ్యర్ 370 పరుగులు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!