Mohammad Siraj: ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో.. నిరాశకు గురయ్యా
ఇటీవల ప్రకటించిన టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో కొంచెం నిరాశకు గురయ్యానని హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. అయితే, జట్టులో చోటు దక్కనంత మాత్రాన కెరీర్..
ఇంటర్నెట్ డెస్కు: ఇటీవల ప్రకటించిన టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో కొంచెం నిరాశకు గురయ్యానని హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. అయితే, జట్టులో చోటు దక్కనంత మాత్రాన కెరీర్ ముగిసిపోయినట్లు కాదని పేర్కొన్నాడు. ‘టీ20 ప్రపంచకప్లో ఆడాలనేది నా కల. అయితే, జట్టు ఎంపిక మన చేతిలో లేదు. జట్టులో చోటు దక్కనంత మాత్రాన కెరీర్ ముగిసిపోయినట్లు కాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతాను. ఫార్మాట్ ఏదైనా జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషిస్తాను’ అని సిరాజ్ చెప్పాడు.
ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటన తనకెన్నో విషయాలను నేర్పించిందని సిరాజ్ అన్నాడు. ‘సీనియర్ బౌలర్లు ఇశాంత్ శర్మ, మహమ్మద్ షమిలతో కలిసి బౌలింగ్ చేయడం మరిచిపోలేని అనుభవం. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి నన్ను ప్రొత్సహించారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవి శాస్త్రిలకు నా ప్రదర్శనపై నమ్మకం ఏర్పడింది’ అని సిరాజ్ పేర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో సిరాజ్ 8 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.