జాగ్రత్తలు చెప్పి వివరాలు అడిగింది..
ఇండియన్ ప్రీమియర్ లీగ్పై బెట్టింగులు ఎప్పుడూ సాగుతూనే ఉంటాయి! అధికారులు, పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఓ చోట బెట్టింగ్ ఉదంతాలు బయటపడుతూనే ఉంటాయి. జట్టు అంతర్గత విషయాలు కూపీ లాగేందుకు ఆటగాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. యూఏఈ వేదికగా...
ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్పై బెట్టింగులు ఎప్పుడూ సాగుతూనే ఉంటాయి! అధికారులు, పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఓ చోట బెట్టింగ్ ఉదంతాలు బయటపడుతూనే ఉంటాయి. జట్టు అంతర్గత విషయాలు కూపీ లాగేందుకు ఆటగాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2020లోనూ ఓ ఆటగాడిని ఓ మహిళ జట్టు అంతర్గత విషయాలు అడిగిన విషయం తాజాగా బయటకొచ్చింది.
దిల్లీకి చెందిన ఓ నర్సు తానొక వైద్యురాలినని టీమ్ఇండియాకు ఆడిన క్రికెటర్ను సోషల్ మీడియాలో కొన్నేళ్ల క్రితం పరిచయం చేసుకుంది. అతడికి పెద్ద అభిమానిగా చెప్పుకుంది. కరోనా నేపథ్యంలో వైరస్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాలని క్రికెటర్ ఆమెను ఆన్లైన్లో సంప్రదించాడు. కొన్ని సూచనలు చేసిన ఆమె సెప్టెంబర్ 30న జట్టు అంతర్గత విషయాల గురించి అడిగింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ క్రికెటర్ కోపాన్ని ప్రదర్శించే ఎమోజీతో బదులిచ్చాడు. పోలీసులకు చెబుతానని హెచ్చరించాడు. దాంతో ఆమె ఏడుస్తున్న ఏమోజీలను పెట్టి క్షమాపణలు కోరింది.
తనను అంతర్గత సమాచారం కోసం ఒకరు అడిగారన్న విషయాన్ని ఆ క్రికెటర్ బీసీసీఐ అవినీతి నిరోధకశాఖ (ఏసీయూ)కు వెంటనే చెప్పేశాడు. దాంతో దర్యాప్తు ఆరంభించిన ఏసీయూ ఆమెకు బెట్టింగ్ మాఫియాతో ఎలాంటి సంబంధాలు లేవని ధ్రువీకరించుకొంది. వ్యక్తిగత క్రికెట్ బెట్టింగ్ కాసేందుకే సమాచారం అడిగిందని తెలుసుకుంది. ఇంకెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా లేవా విచారించగా అలాంటివేమీ లేవని తేలింది. దాంతో వెంటనే ఆ కేసును మూసేశామని ఏసీయూ చీఫ్ అజిత్సింగ్ మీడియాకు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మరో ఆటగాడినీ ఒకరు సంప్రదించగా ఈ విషయం బయటకు తెలిసింది.
ఇవీ చదవండి
రోహిత్ శతకంతోనే తిరిగొస్తాడు: లక్ష్మణ్
జూలో జంతువుల్లా చేస్తారా:టీమ్ఇండియా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు