Rahul Dravid: ద్రవిడ్‌ టీమ్‌ఇండియా కోచ్‌ అవ్వొద్దు!

టీమ్‌ఇండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ అండర్‌-19, భారత్‌-ఏ కోచ్‌గానే కొనసాగాలని  మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ అంటున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా ఆయన రిజర్వు బెంచ్‌ని పటిష్ఠం చేయడమే మంచిదని పేర్కొన్నాడు....

Published : 09 Jul 2021 15:07 IST

కుర్రాళ్లకే అతడి అవసరం ఎక్కువ: జాఫర్‌

ముంబయి: టీమ్‌ఇండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ అండర్‌-19, భారత్‌-ఏ కోచ్‌గానే కొనసాగాలని మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ అంటున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా ఆయన రిజర్వు బెంచ్‌ని పటిష్ఠం చేయడమే మంచిదని పేర్కొన్నాడు. అంతర్జాతీయ స్టార్ల కన్నా కుర్రాళ్లకే ఆయన మార్గనిర్దేశం అవసరమని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడాడు. ‘రాహుల్‌ ద్రవిడ్‌కు ఇంతకన్నా ఎక్కువ ఘనతే దక్కాలి. ఎన్‌సీయే ప్రధాన కోచ్‌గా ఆయన పనితీరు అద్భుతం. అండర్‌-19, భారత్‌-ఏ, గాయపడి ఎన్‌సీయేకు వెళ్లిన అంతర్జాతీయ ఆటగాళ్లకు ఆయన మార్గనిర్దేశం చేస్తాడు. వారికి అంతకు మించిన ఆదర్శనీయుడు ఎవరూ దొరకరు’ అని జాఫర్‌ అన్నాడు.

‘శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టుకు ద్రవిడ్‌ కోచ్‌గా వెళ్లాడు. ఈ సిరీసుతో కుర్రాళ్లు తప్పక ప్రయోజనం పొందుతారు. అయితే ఒక అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా ఆయన తనకు తానుగా వెళ్లొద్దని నా అభిప్రాయం. అండర్‌-19, ఎన్‌సీయేకు వచ్చే క్రికెటర్లకు ఆయన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే టీమ్‌ఇండియాకు ఆడుతున్న వారు ఎదిగారు. అండర్‌-19, భారత్‌-ఏ క్రికెటర్లు తర్వాతి స్థాయికి ఎదిగేందుకు ఆయన మార్గనిర్దేశం అవసరం’ అని వసీమ్‌ అన్నాడు. లంక పర్యటనకు ఎంపికైన క్రికెటర్లకు జాఫర్‌ శుభాకాంక్షలు తెలియజేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని