IPL 2022: ఆ నైపుణ్యాన్ని ధోనీ నుంచే నేర్చుకున్నా: సన్రైజర్స్ ఆటగాడు
ఒత్తిడి సమయాల్లోనూ ప్రశాంతంగా బ్యాటింగ్ చేసే అద్భుతమైన నైపుణ్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నుంచి నేర్చుకున్నానని చెప్పాడు సన్రైజర్స్ హైదరాబాద్...
(Photo: Rahul Tripathi Twitter)
ఇంటర్నెట్డెస్క్: ఒత్తిడి సమయాల్లోనూ ప్రశాంతంగా బ్యాటింగ్ చేసే అద్భుతమైన నైపుణ్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నుంచి నేర్చుకున్నానని చెప్పాడు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి. గత నెల ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఈ మహారాష్ట్ర ఆటగాడిని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రూ.8.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడాడు.
రాహుల్ గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడగా.. ఆ జట్టు ఫైనల్కు చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో కోల్కతాను ఘోర పరాజయం నుంచి తప్పించాడు. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 135/5 తక్కువ స్కోరుకే పరిమితమైంది. అయితే, ఛేదనలో కోల్కతా సునాయాస విజయం సాధించేలా కనిపించినా చివరి క్షణాల్లో ఓటమి అంచున నిలిచింది. ఆఖరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో ఓ భారీ సిక్సర్తో రాహుల్ మ్యాచ్ను గెలిపించాడు. ఈ విషయంపైనే అతడు మాట్లాడుతూ ఒత్తిడిలో ప్రశాంతంగా బ్యాటింగ్ చేయడం ధోనీ నుంచి నేర్చుకున్నానని తెలిపాడు.
‘ఆరోజు మ్యాచ్లో చివర్లో సిక్సర్ కొట్టి మ్యాచ్ను గెలిపించడం నాకెంతో ప్రత్యేకం. అయితే, ఆరోజు క్లిష్ట సమయంలో బ్యాటింగ్ చేసేటప్పుడు నేనేం ఒత్తిడికి గురవ్వలేదు. మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నా. మ్యాచ్ను గెలిపించాలని అనుకున్నా. భావోద్వేగాలన్నీ కడుపులోనే దాచుకున్నా. అలా ఒత్తిడిలోనూ ప్రశాంతంగా బ్యాటింగ్ చేసే నైపుణ్యాన్ని ధోనీ నుంచి నేర్చుకున్నా’ అని అతడు చెప్పుకొచ్చాడు. కాగా, రాహుల్ ఇప్పటివరకు టీమ్ఇండియాకు ఎంపికవ్వకపోయినా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. క్లిష్ట సమయాల్లో అనూహ్యంగా రాణిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ఈ కారణం చేతే సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి అతడిని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇంతకుముందు అతడు ధోనీ సారథ్యంలో రైజింగ్ పుణె తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఆపై రాజస్థాన్, కోల్కతా జట్లలోనూ ప్రాతినిధ్యం వహించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.