ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్‌.. నాలుగో స్థానంలో మిథాలీ.. పదిలో స్మృతి మంధాన

ఐసీసీ విమెన్స్‌ వన్డే ప్లేయర్ల ర్యాంకులను ఐసీసీ మంగళవారం ప్రకటించింది.  టీమ్‌ఇండియా మహిళా క్రికెట్ కెప్టెన్‌ మిథాలీ రాజ్, స్మృతి మంధాన రెండు ర్యాంకులు కోల్పోయారు. ఐసీసీ మహిళల వన్డే..

Published : 08 Mar 2022 22:23 IST

ఇంటర్నెట్ డెస్క్ : ఐసీసీ విమెన్స్‌ వన్డే ప్లేయర్ల ర్యాంకులను ఐసీసీ మంగళవారం ప్రకటించింది.  టీమ్‌ఇండియా మహిళా క్రికెట్ కెప్టెన్‌ మిథాలీ రాజ్, స్మృతి మంధాన రెండు ర్యాంకులు కోల్పోయారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో.. మిథాలీ రాజ్‌ (9) పరుగులకే ఔట్ కాగా.. స్మృతి మంధాన (52) అర్ధ శతకంతో రాణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిథాలీ 718 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. స్మృతి మంధాన 670 పాయింట్లతో పదో ర్యాంకు దక్కించుకుంది. 

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో అర్ధ శతకంతో రాణించిన పూజ వస్త్రకార్‌కి 64వ ర్యాంకు దక్కింది. బౌలర్ల విభాగంలో సీనియర్‌ పేసర్‌ ఝులన్‌ గోస్వామి స్థానంలో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం ఆమె నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. స్పిన్‌ ఆల్ రౌండర్‌ దీప్తి శర్మ ఒక ర్యాంకు కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయారు. ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ కోసం క్లిక్‌ చేయండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని