IPL 2022 : ఐపీఎల్ కోసం బంగ్లాతో టెస్టు సిరీస్ వద్దనుకుని..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ పోటీల కోసం ..
భారత్కు రానున్న దక్షిణాఫ్రికా బౌలర్లు!
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ పోటీల కోసం అంతర్జాతీయ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. తమ దేశం తరఫున ఆడాల్సిన షెడ్యూల్ను పూర్తి చేసుకుని ఇప్పటికే కొంతమంది భారత్కు చేరుకోగా.. మరికొందరు మాత్రం ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండరు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టాప్ బౌలర్లు కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్ తదితరులు బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్లో పాల్గొనకుండా ఐపీఎల్ కోసం రానున్నట్లు సమాచారం.
మార్చి 18, మార్చి 20, 23వ తేదీల్లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అనంతరం మార్చి 31 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్లో పాల్గొన్న తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కలిసేందుకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండబోమని ఇప్పటికే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు తెలిపినట్లు సమాచారం. ఐపీఎల్ మెగా వేలంలో జాన్సెన్ను సన్రైజర్స్ హైదరాబాద్, రబాడను పంజాబ్ కింగ్స్, ఎంగిడిని దిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మరో ఫాస్ట్బౌలర్ ఆన్రిచ్ నార్జ్ రాకపై సందిగ్ధత నెలకొంది. గాయపడిన నార్జ్ ఫిట్నెస్ను నిరూపించుకుంటే ఆడే అవకాశం ఉంది. నార్జ్ను దిల్లీ రిటెయిన్ చేసుకుంది. మార్చి 26 నుంచి ముంబయి వేదికగా ఐపీఎల్ -15వ సీజన్ ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు