Ramiz Raja: రమీజ్ రజాకి పదవీ గండం.. పీసీబీ ఛైర్మన్గిరీ నుంచి తప్పించడం ఖాయమేనా..?
స్వదేశం వేదికగా ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్తోపాటు టెస్టు సిరీస్ను పాక్ కోల్పోవడంతో అక్కడి అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రేగాయి. కెప్టెన్ బాబర్ అజామ్తోపాటు పీసీబీ ఛైర్మన్పై వేటు వేయాలనే డిమాండ్లూ వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: సందర్భం ఉన్నా లేకపోయినా టీమ్ఇండియాపై అక్కసు వెళ్లగక్కే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రజా పదవిపై కత్తి వేలాడుతోంది. అతడు 2021లో పీసీబీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టాడు. రమీజ్ రజా హయాంలో పాకిస్థాన్ టీ20ల్లో అద్భుత ప్రదర్శనే చేసింది. అయితే, తాజాగా ఇంగ్లాండ్ చేతిలో స్వదేశం వేదికగానే పాక్ ఘోర పరాభవాలను ఎదుర్కోవడంతో అతడిని పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. అంతేకాకుండా క్రికెట్ బోర్డులో రాజకీయంగానూ నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది. బోర్డులోని సభ్యులు కూడా అతడిని తొలగించడానికే మొగ్గు చూపుతున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
‘‘అవును. బోర్డులో ఏదో జరగబోతోంది. మాజీ ఛైర్మన్ నజామ్ సేథి మరోసారి బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉంది. రమీజ్ రజాను తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని పీసీబీ మాజీ సభ్యుడు ఒకరు పేర్కొన్నాడు.
2018లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పీటీఐ మెజార్టీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పుడు వెంటనే పీసీబీ ఛైర్మన్ పదవికి నజామ్ సేథి రాజీనామా చేశాడు. పీసీబీ రాజ్యాంగం ప్రకారం ఛైర్మన్ పదవిని దేశ ప్రధానమంత్రి నామినేట్ చేస్తారు. ఇమ్రాన్ ప్రభుత్వం పడిపోవడం.. కొత్త ప్రధానిగా షెహ్బాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చారు. దీంతో రజాను తప్పించడం ఖాయమనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం