Ramiz Raja: రమీజ్ రజాకి పదవీ గండం.. పీసీబీ ఛైర్మన్గిరీ నుంచి తప్పించడం ఖాయమేనా..?
స్వదేశం వేదికగా ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్తోపాటు టెస్టు సిరీస్ను పాక్ కోల్పోవడంతో అక్కడి అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రేగాయి. కెప్టెన్ బాబర్ అజామ్తోపాటు పీసీబీ ఛైర్మన్పై వేటు వేయాలనే డిమాండ్లూ వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: సందర్భం ఉన్నా లేకపోయినా టీమ్ఇండియాపై అక్కసు వెళ్లగక్కే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రజా పదవిపై కత్తి వేలాడుతోంది. అతడు 2021లో పీసీబీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టాడు. రమీజ్ రజా హయాంలో పాకిస్థాన్ టీ20ల్లో అద్భుత ప్రదర్శనే చేసింది. అయితే, తాజాగా ఇంగ్లాండ్ చేతిలో స్వదేశం వేదికగానే పాక్ ఘోర పరాభవాలను ఎదుర్కోవడంతో అతడిని పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. అంతేకాకుండా క్రికెట్ బోర్డులో రాజకీయంగానూ నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది. బోర్డులోని సభ్యులు కూడా అతడిని తొలగించడానికే మొగ్గు చూపుతున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
‘‘అవును. బోర్డులో ఏదో జరగబోతోంది. మాజీ ఛైర్మన్ నజామ్ సేథి మరోసారి బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉంది. రమీజ్ రజాను తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని పీసీబీ మాజీ సభ్యుడు ఒకరు పేర్కొన్నాడు.
2018లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పీటీఐ మెజార్టీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పుడు వెంటనే పీసీబీ ఛైర్మన్ పదవికి నజామ్ సేథి రాజీనామా చేశాడు. పీసీబీ రాజ్యాంగం ప్రకారం ఛైర్మన్ పదవిని దేశ ప్రధానమంత్రి నామినేట్ చేస్తారు. ఇమ్రాన్ ప్రభుత్వం పడిపోవడం.. కొత్త ప్రధానిగా షెహ్బాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చారు. దీంతో రజాను తప్పించడం ఖాయమనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.