Dhoni: కెరీర్ మొత్తంలో మహీ అదొక్కటే చేశాడు..
ఆస్ట్రేలియా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా ధోనీలాంటి మేటి ఫినిషర్ లేడని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ అన్నాడు. అలాంటి ఆటగాడి కోసం కంగారు జట్టు ఎప్పుడూ ఆలోచించేదని చెప్పాడు..
ఆస్ట్రేలియాకు అలాంటి ఆటగాడు లేడు: పాంటింగ్
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా ధోనీలాంటి మేటి ఫినిషర్ లేడని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అది టీ20 ప్రపంచకప్లో కంగారూలకు ప్రతికూలాంశమని అన్నాడు. అలాంటి ఆటగాడి కోసం కంగారు జట్టు ఎప్పుడూ ఆలోచించేదని చెప్పాడు. ఫినిషర్ స్థానం ఎంతో ప్రత్యేకమని, చివరి మూడు, నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయాలంటే అదే సరైన స్థానమని అన్నాడు. ఈ సందర్భంగా టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని ప్రశంసలతో ముంచెత్తాడు.
‘ధోనీ కెరీర్ సాగినంత కాలం ఆ ఒక్క స్థానంలోనే ఆడాడు. అక్కడ తనదైన ముద్ర వేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ కూడా అలాంటి ఆటగాళ్లే. తమ దేశాలకు, లేదా ఐపీఎల్ జట్లకు నిలకడగా విజయాలు అందిస్తున్నారు. వాళ్లిద్దరూ ఆయా స్థానాలకు పరిమితమయ్యారు. అయితే, ఆస్ట్రేలియా జట్టులో సరైన ఫినిషర్ లేకపోడానికి ప్రధాన కారణం.. అందులో బాగా ఆడే ఆటగాళ్లంతా బిగ్బాష్ లీగ్లో టాప్ఆర్డర్లో ఆడటమే’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా జట్టులో ఫినిషర్ స్థానంలో సరైన బ్యాట్స్మెన్ లేరని, అలాంటి ఆటగాడి కోసమే వెతకాల్సి ఉందని మాజీ కెప్టెన్ వివరించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్లను మ్యాచ్ ఫినిషర్లుగా పరిగణించాల్సి ఉందా? అని పాంటింగ్ ఎదురు ప్రశ్నించాడు. ఆ ముగ్గురూ బిగ్బాష్లో టాప్ఆర్డర్లో ఆడతారని, వారిని లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయమని ఆయా జట్లను కోరడం కష్టమని తెలిపాడు. కాగా, ఐపీఎల్లో దిల్లీ జట్టుకు కోచ్గా ఉన్న పాంటింగ్ స్టోయినిస్ను మ్యాచ్ ఫినిషర్గా చూడాలనుకున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే అతడిని ఇటీవల మిడిల్ ఆర్డర్లో పంపగా పలు విజయాలు సాధించాడని గుర్తుచేశాడు. సరైన ఆటగాళ్లను లోయర్ ఆర్డర్లో అలా ఆడిస్తేనే మంచి ఫినిషర్లుగా తయారవుతారని పాంటింగ్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.