Rohit - Kohli: కోహ్లీ కోసం ఈ టెస్టును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాం: రోహిత్
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి శ్రీలంకతో జరిగే తొలి టెస్టు వందో మ్యాచ్ అయిన నేపథ్యంలో దాన్ని మరింత ప్రత్యేకంగా నిర్వహించాలనుకుంటున్నట్లు నూతన...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి శ్రీలంకతో జరిగే తొలి టెస్టు వందో మ్యాచ్ అయిన నేపథ్యంలో ఈ టెస్టును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తామని జట్టు సారథి రోహిత్ శర్మ మీడియాతో అన్నాడు. తొలి టెస్టుకు ముందు గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఏ ఆటగాడైనా వంద టెస్టులు ఆడటం మామూలు విషయం కాదని, ఈ విషయంలో అతడు చాలా దూరం పయనించాడని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇదో అద్భుతమైన ప్రయాణమని కొనియాడాడు.
‘టెస్టుల్లో విరాట్ అత్యద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇప్పుడు టీమ్ఇండియా ముందుకు సాగుతున్న విషయంలో ఎన్నో మార్పులు తెచ్చాడు. అతడికి ఈ ప్రయాణం ఎంతో సంతోషాన్ని మిగిల్చి ఉంటుంది. రాబోయే రోజుల్లోనూ ఇలాగే ఉంటుంది. ఈ వందో టెస్టును అతడికి మరింత ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాం. అందుకోసం ఈ మ్యాచ్ ఐదు రోజుల పాటు పూర్తిగా జరగాలని కోరుకుందాం. 2018లో మేం ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచాం. అదెంతో ప్రత్యేకం. అప్పుడు కోహ్లీనే కెప్టెన్గా ఉన్నాడు. అలాగే ఆటగాడిగా అతడికి మరిచిపోలేని ఇన్నింగ్స్ అంటే 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో అతడు సాధించిన శతకమే. కఠిన పరిస్థితుల్లో నిలబడి మూడంకెల స్కోర్ సాధించాడు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
‘ఆ పర్యటనలో చాలా మంది ఆటగాళ్లు తొలిసారి అక్కడి మైదానాల్లో ఆడారు. పరిస్థితులు కఠినమైన సవాళ్లు విసిరినా మోర్కెల్, స్టెయిన్ లాంటి బౌలర్లను తట్టుకొని కోహ్లీ నిలబడ్డాడు. ఆ మ్యాచ్లో అతడు రెండు ఇన్నింగ్స్ల్లోనూ రాణించాడు. కోహ్లీ బ్యాటింగ్లో నేను గుర్తుపెట్టుకున్న అతిగొప్ప ఇన్నింగ్స్ల్లో ఆ మ్యాచ్ ఒకటి. 2011లో టెస్టు క్రికెట్ మొదలెట్టి చాలా దూరం వచ్చాడు’ అని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. తాను ఇప్పుడు జట్టు విజయాల కోసమే ఆలోచిస్తున్నానని, ఒక జట్టుగా టీమ్ఇండియా ఇప్పుడు మంచి స్థితిలో ఉందని చెప్పాడు. అందుకు విరాట్ కోహ్లీనే కారణమన్నాడు. అతడు టెస్టు జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దాడని, ఇక్కడి నుంచి తాను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. అలాగే తాము ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో మధ్యలో ఉన్నామని, ఇకపై ప్రతి గేమ్లోనూ విజయం సాధించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అలాగే తమ తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగాలనుకుంటున్నట్లు రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.