Bangalore vs Gujarat: హడలెత్తించిన బెంగళూరు బౌలర్లు.. టార్గెట్‌ 108

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రాణించారు.

Published : 27 Feb 2024 21:27 IST

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రాణించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి బ్యాటర్లను కట్టుదిట్టంగా బంతులు వేసి హడలెత్తించారు. దయాలన్ హేమలత (31*), హర్లీన్‌ డియోల్ (22) ఫర్వాలేదనిపించడంతో.. గుజరాత్‌ 7 వికెట్ల నష్టానికి 107 పరుగులైనా చేసింది. వారిద్దరూ ఆడకుంటే ఇంకా తక్కువ స్కోర్‌కే GGT పరిమితమయ్యేది. ఆ తర్వాత స్నేహ్ రాణా 12 పరుగులు చేయగా.. మిగిలిన వారెవరూ 10 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు. బెంగళూరు బౌలర్లలో సోఫీ మోలినెక్స్ 3, రేణుకా ఠాకూర్‌సింగ్‌ 2, జార్జియా వారెహమ్‌ ఒక వికెట్‌ తీసింది. మరి 108 లక్ష్యచేధనలో స్మృతి మంధాన సేన ఎలా ఆడుతుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని