Bangalore vs Gujarat: హడలెత్తించిన బెంగళూరు బౌలర్లు.. టార్గెట్ 108
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024)లో గుజరాత్ జెయింట్స్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రాణించారు.
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024)లో గుజరాత్ జెయింట్స్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ప్రత్యర్థి బ్యాటర్లను కట్టుదిట్టంగా బంతులు వేసి హడలెత్తించారు. దయాలన్ హేమలత (31*), హర్లీన్ డియోల్ (22) ఫర్వాలేదనిపించడంతో.. గుజరాత్ 7 వికెట్ల నష్టానికి 107 పరుగులైనా చేసింది. వారిద్దరూ ఆడకుంటే ఇంకా తక్కువ స్కోర్కే GGT పరిమితమయ్యేది. ఆ తర్వాత స్నేహ్ రాణా 12 పరుగులు చేయగా.. మిగిలిన వారెవరూ 10 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు. బెంగళూరు బౌలర్లలో సోఫీ మోలినెక్స్ 3, రేణుకా ఠాకూర్సింగ్ 2, జార్జియా వారెహమ్ ఒక వికెట్ తీసింది. మరి 108 లక్ష్యచేధనలో స్మృతి మంధాన సేన ఎలా ఆడుతుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.