సైని × శార్దూల్.. ఎవరికి చోటు?
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమ్ఇండియా మరో తలనొప్పి! గాయపడ్డ ఉమేశ్ యాదవ్ స్థానంలో ఎవరిని ఆడించాలా అని జట్టు యాజమాన్యం తల పట్టుకొంది. యువపేసర్ నవదీప్ సైని, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల శార్దూల్ ఠాకూర్లో ఎవరిని ఎంపిక చేయాలన్న సందిగ్ధం నెలకొంది. ఫామ్లేమితో....
సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమ్ఇండియాకు మరో తలనొప్పి! గాయపడ్డ ఉమేశ్ యాదవ్ స్థానంలో ఎవరిని ఆడించాలా అని జట్టు యాజమాన్యం తల పట్టుకొంది. యువపేసర్ నవదీప్ సైని, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల శార్దూల్ ఠాకూర్లో ఎవరిని ఎంపిక చేయాలన్న సందిగ్ధం నెలకొంది. ఫామ్లేమితో సతమతం అవుతున్న మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ శర్మ రావడం ఖాయమైంది. స్థిరంగా, నిలకడగా ఆడుతున్న శుభ్మన్ గిల్తో కలిసి హిట్మ్యాన్ ఓపెనింగ్ చేయనున్నాడు. గత ఎనిమిది టెస్టు ఇన్నింగ్సుల్లో ఏడింట్లో విఫలం కావడంతో మయాంక్ చోటు కోల్పోక తప్పడం లేదు.
కొన్ని రోజుల క్రితం శార్దూల్ ఠాకూర్ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమని చర్చ నడిచింది. కాగా అత్యంత వేగంగా బంతులు విసరగల సైనిని తీసుకుంటే బాగుంటుందని టీమ్ఇండియా సీనియర్లు భావిస్తున్నారని సమాచారం. మంగళవారం సిడ్నీ క్రికెట్ పిచ్పై కవర్లు తొలగించకపోవడంతో బౌలింగ్ విభాగంపై అంచనాకు రాలేకపోయారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పిచ్పై కవర్లు తొలగించలేదు. ఒకవేళ పిచ్పై తేమ ఉంటే ఠాకూర్ను తీసుకోవచ్చు. ఫ్లాట్గా ఉంటే మాత్రం పాత బంతిని రివర్స్స్వింగ్ చేయగల సైనికే ప్రాధాన్యం ఇస్తారు. దాంతో ఆసీస్ను దెబ్బకొట్టొచ్చన్నది టీమ్ఇండియా ప్రణాళిక.
సైనికి జట్టులో చోటు దక్కితే అతడు అరంగేట్రం చేస్తాడు. శార్దూల్ ఠాకూర్కూ ఇదొక అరంగేట్రం లాంటిదే. ఎందుకంటే రెండేళ్ల క్రితం అతనాడిన తొలి మ్యాచులో తొలి ఓవర్ పూర్తికాకముందే గాయంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత జట్టులో చోటు లభించలేదు. తాజాగా మూడో పేసర్ స్థానంలో నటరాజన్ పేరూ వినిపిస్తోంది. తెలుపు రంగు జెర్సీలో అతడు ఫొటోషూట్లో పాల్గొనడం చర్చకు తావిచ్చింది. 20 ఫస్ట్క్లాస్ మ్యాచులాడిన నట్టూ ఏడాది క్రితం దేశవాళీలో సుదీర్ఘ ఫార్మాట్ ఆడాడు. చెపాక్ వేదికగా రైల్వేస్తో జరిగిన మ్యాచులో 11 ఓవర్లు విసిరి మూడు వికెట్లు తీశాడు. మొత్తానికి మూడో టెస్టులో మూడో పేసర్ ఎవరో తెలుసుకొనేందుకు బుధవారం వరకు ఆగాల్సిందే.
టీమ్ఇండియా అంచనా జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (సారథి), హనుమ విహారి, రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్/నవదీప్ సైని
ఇవీ చదవండి
రోహిత్ శతకంతోనే తిరిగొస్తాడు: లక్ష్మణ్
జూలో జంతువుల్లా చేస్తారా:టీమ్ఇండియా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.